వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం -కుటుంబాలపై ఇలా రాయొచ్చా? నీతిమాలిన చర్యలంటూ..

|
Google Oneindia TeluguNews

దివంగత వైఎస్సార్ రాజకీయ వారసత్వం కోసం కుటుంబంలో తగాదా నడుస్తోందని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఆయన సోదరి వైఎస్ షర్మిల విభేదిస్తున్నారని.. అన్నపై ప్రతీకారంగా షర్మిల కొత్త పార్టీ స్థాపించబోతున్నారంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రిక యజమాని ఆర్కే ఆదివారం తన 'కొత్త పలుకు' కాలమ్ లో వివాదాస్పద అభిప్రాయాలను రాసుకురావడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో అది చర్చనీయాంశం కావడం తెలిసిందే. కాగా, సదరు కథనంపై వైఎస్ షర్మిల ఫైరయ్యారు..

వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్

ఆంధ్రజ్యోతి పత్రికపై వైసీపీ ముఖ్యనాయకురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు ఆ పత్రిక ప్రచురించిన కథనంపై ఆమె స్పందించారు. తప్పుడు కథనాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం బెంగళూరు నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

 ys sharmila condemns media stories of her Conflicts with cm brother jagan

''ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్‌ ఐటమ్‌గా వచ్చిన వార్త నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పత్రిక అయినా, ఏ చానల్‌ అయినా ఓ కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయటమే తప్పు. అది నీతిమాలిన చర్య. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్‌ మీద న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని తెలియజేస్తున్నా'' అని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. కాగా,

నిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జలనిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జల

సీఎం జగన్ సోదరిగా, వైసీపీ ముఖ్యనాయకురాలిగా పాపులర్ అయినప్పటికీ, పార్టీ పరంగా ఆమెకు ఎలాంటి పదవి లేకపోవడంతో ఆంధ్రజ్యోతికి హెచ్చరిక నోట్ ను (లెట్ హెడ్ పై కాకుండా) తెల్ల కాగితంపై జారీ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరలైన ఈ ప్రెస్ నోట్ నిజమైనదా? ఫేకా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ వెంటనే షర్మిల తన అధికారిక ట్విటర్ లోనూ ఈ నోట్ ను షేర్ చేయడంతో అనుమానాలకు చెక్ పడింది.

English summary
ys sharmila, well known sister of andhra pradesh chief minister ys jagan, condemns media stories on her. sharmila condemns a local paper story, which alleged that siblings have been facing conflict. sharmila also warns to the media for mispropaganda
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X