వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాటలే.. చేతల్లేవు: కెసిఆర్, బాబులపై విజయమ్మ, టి ఆఫీస్ ప్రారంభం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు చెప్పడం తప్ప, చేతల్లేవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆరోపించారు. ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ...
అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని పాలించారని అన్నారు.

ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా ఆయన పాలన సాగించారని ఆమె గుర్తు చేశారు. వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను బతికించుకుందామని, పార్టీని అందరం కలిసి ముందు తీసుకెళ్తామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రతి నిమిషం ప్రజలకు ఏం చేయాలన్న తపనే వైయస్సార్‌లో ఉండేదని తెలిపారు. ప్రతి ఒక్కరికి సాయపడాలన్నదే వైయస్సార్ సంకల్పమని అన్నారు. వైయస్సార్‌కు కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్న తేడాల్లేవని పేర్కొన్నారు. వైయస్సార్ ప్రభుత్వం మన ప్రభుత్వమని ప్రజలందరూ భావించేలా కృషి చేశారని విజయమ్మ తెలిపారు.

YS Vijayamma launched YSRCP Telangana Office in Hyderabad

కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయి: పొంగులేటి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కలిసి శ్రమిద్దామని నేతలు, కార్యకర్తలకు సూచించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగసిపడేలా పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మిద్దామని పిలుపునిచ్చారు. అందరం కష్టపడి పనిచేద్దామని, తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికలోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని పొంగులేటి చెప్పారు.

English summary
YS Vijayamma on Sunday launched YSRCP Telangana Office in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X