వైసీపీ నాయకురాలి కూతురుకి సివిల్స్ ర్యాంక్, ఏపీ కేడర్కే తొలి ఆప్షన్
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శనివారం సివిల్స్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో శ్రీకాకుళం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కుమార్తె వేదితా రెడ్డి 71వ ర్యాంకు సాధించింది. ఆమె వయస్సు 23.
శనివారం సివిల్స్ ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెందిన 50 మందికి పైగా సివిల్స్లో సత్తా చాటారు. 4, 18, 30, 44, 49, 50, 66, 71, 88, 97 తదితర ర్యాంకులు వందలోపు వచ్చాయి.
సివిల్స్లో తెలుగు విద్యార్థుల సత్తా, టాప్ 100లో..
అందులో వేదితా రెడ్డి 71వ ర్యాంకు సాధించింది. వేదితా రెడ్డి తల్లి స్వస్థలం శ్రీకాకుళం. తండ్రి స్వస్థలం విజయనగరం. వేదితా రెడ్డి ఆరో తరగతి నుండి 12వ తరగతి వరకు ఢిల్లీలోని సంస్కృతి పాఠశాలలో చదివింది. నోయిడాలో 2013లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో బీటెక్ పూర్తి చేసింది. ఏపీ కేడర్కు మొదటి ఆప్షన్ ఇచ్చింది.