ధర్నా: జగన్ పార్టీ నేతల అరెస్ట్, తొక్కిసలాట, ఉద్రిక్తత(పిక్చర్స్)
విశాఖపట్నం: నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం నగరంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతల మధ్య ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి నగరంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు బయలుదేరుతుండగా, ర్యాలీకి అనుమతి లేదంటూ పొలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్టులు చేయటం అన్యాయమంటూ వైయస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు మాజీ ఎమ్యెల్యేలు కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు.
అయితే ర్యాలీకి అనుమతి లేనందునే అరెస్టు చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరగటంతో దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేసిన పోలీసులు నగర పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. 100 మందికి పైగా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ధర్నా, అరెస్టులు
నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం నగరంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతల మధ్య ముగిసింది.
ధర్నా, అరెస్టులు
వివిధ ప్రాంతాల నుంచి నగరంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు బయలుదేరుతుండగా, ర్యాలీకి అనుమతి లేదంటూ పొలీసులు అడ్డుకున్నారు.
ధర్నా, అరెస్టులు
ఈ సందర్భంగా పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది.
ధర్నా, అరెస్టులు
శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్టులు చేయటం అన్యాయమంటూ వైయస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు మాజీ ఎమ్యెల్యేలు కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు.
ధర్నా, అరెస్టులు
అయితే ర్యాలీకి అనుమతి లేనందునే అరెస్టు చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
ధర్నా, అరెస్టులు
ఈ సందర్భంగా తొక్కిసలాట జరగటంతో దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేసిన పోలీసులు నగర పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. 100 మందికి పైగా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ధర్నా, అరెస్టులు
శాంతియుతంగా ఆందోళనకు దిగితే అక్రమంగా అరెస్టులు చేయడం అమానుషమంగా మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
ధర్నా, అరెస్టులు
ఇది ఇలాఉంటే మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు.
ధర్నా, అరెస్టులు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్యులకు అందుబాటులో లేని నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.