వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై దూషణ ఎఫెక్ట్: జేసీ ప్రభాకర్‌పై కేసు నమోదు చేయాలని ధర్నా

తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ అనంతపురంలోని జేసీ ట్రావెల్స్‌ కార్యాలయం ఎదుట వైసిపి నేతలు ఆందోళనకు దిగారు.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ అనంతపురంలోని జేసీ ట్రావెల్స్‌ కార్యాలయం ఎదుట వైసిపి నేతలు ఆందోళనకు దిగారు.

ప్రతిపక్ష నేతను దూషించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు నమోదు చేయాలంటూ బైఠాయించి నిరసన చేపట్టారు. జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.

<strong>'వైయస్ ఫ్యామిలీ గట్టు రట్టు చేయనున్న జేసీ బ్రదర్స్'</strong>'వైయస్ ఫ్యామిలీ గట్టు రట్టు చేయనున్న జేసీ బ్రదర్స్'

YSRCP dharna at Diwakar Travels office in Anantapur

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే జేసీపై కేసు నమోదు చేసేవరకు ఆందోళన విరమించబోమని చెప్పడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్‌ చేశారు.

సీఎం నాకు ఏ సాయం చేశారో చెప్పాలి: జేసీ

ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఏం సాయం చేశారో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చెప్పాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం నాడు మరోసారి ప్రశ్నించారు. అభాండాలు వేసి సీఎంను రచ్చకు ఈడ్చవద్దన్నారు. తమ దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాద సంఘనటపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు.

English summary
YSRCP activists stage dharna at Diwakar Travels office in Anantapur on Sunday. They are demanded for JC Prabhakar Reddy's arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X