పార్టీ నాయకులపై బీరు బాటిళ్లతో వైసీపీ కార్యకర్తల దాడి: మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందంటూ: బీజేపీ
చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఆరోపిస్తున్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ను దాఖలు చేయడానికి వెళ్లిన కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి చేశారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జి సునీల్ దేవ్ధర్, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల కోసం నామినేషన్ వేయడానికి వెళుతున్న బీజేపీ కార్యకర్తలపై నిన్న వైసీపీ గుండాలు దాడులకు తెగబడ్డారు. pic.twitter.com/rHrFAZt4Zy
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) March 11, 2020
రక్తమోడుతున్న ఇద్దరు కార్యకర్తల వీడియోను వారు ట్వీట్ చేశారు. చిత్తూరుజిల్లాలోని పులిచెర్ల మండలంలో ఈ దాడి చోటు చేసుకుందని, దీని వెనుక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రమేయం ఉందని మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని, ఆయన నియోజకవర్గం పరిధిలో తాము అత్యధిక స్థానాలను గెలుచుకోబోతున్నామని అన్నారు. దీన్ని భరించలేకనే ఆయన తన అనుచరులతో పార్టీ కార్యకర్తలపై ప్రాణాంతక దాడులు చేయడానికి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారిని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై తాము చిత్తూరు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పులిచెర్ల సమీపంలో మంగళవారం చోటు చేసుకున్న ఈ దాడిలో మదన్మోహన్, ప్రేమ్కుమార్, మాదాసు లోకేశ్, దొరస్వామి, హరిబాబు, పోలిశెట్టి వెంకట్రావులకు గాయాలయ్యాయని అన్నారు.
స్థానిక పోరు.. వారసుల జోరు: నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి కుమార్తె ఎంట్రీ..?
Recommended Video
వైసీపీ నాయకులు బీరు బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారని చెప్పారు. ఈ దాడిలో బీజేపీ నాయకుల కారు అద్దాలు ధ్వంసం అయ్యాయని, తమ నాయకులు వారి బారి నుంచి తప్పించుకుని కల్లూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న ప్రకటనల్లో ఏ మాత్రం వాస్తవం లేదనే విషయం ఈ ఘటనతో నిరూపితమైందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని తాము రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్కుమార్కు వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు.