వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ఆర్ సీపీ లోక్ సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఇంట్లో విషాదం

|
Google Oneindia TeluguNews

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట‍్ల మాధవ్‌ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనకు పితృ వియోగం కలిగింది. గోరంట్ల మాధవ్‌ తండ్రి కురుబ మాధవస్వామి శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు.

YSRCP Hindupur Lok Sabha Candidate Gorantla Madhav father is no more

కర్నూలు జిల్లా పీ రుద్రవరంలో మాధవ స్వామి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాధవస్వామి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంతాపం తెలిపింది. గోరంట్ల మాధవ్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. తండ్రి మరణించిన సమాచారం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన స్వస్థలానికి బయలుదేరి వెళ్లారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే కదిరి, పెనుకొండ, హిందూపురం, ధర్మవరం అసెంబ్లీ స్థానాల వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు డాక్టర్ సిద్ధా రెడ్డి, శంకర నారాయణ, ఇక్బాల్, కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి తదితరులు మాధవ్ కు ఫోన్ చేశారు. తమ సానుభూతిని వ్యక్తం చేశారు.

English summary
Gotantla Madhav, Hindupur Lok Sabha candidate from YSR Congress Party in Ananthapur district loses his father Madhava Swamy. He was 85 years. Funeral of Kuruba Madhava Swamy's remains will be held at Rudravaram village in Kurnool district on Saturday, family members told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X