కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపలో టిడిపి నేత భాస్కర్‌రెడ్డిపై వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి కాల్పులు

కడప జిల్లా వీన్‌పల్లి మండలంలోని ఈర్లపల్లి గ్రామంలో టిడిపి నేత భాస్కర్‌రెడ్డిపై వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బాస్కర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లా వీన్‌పల్లి మండలంలోని ఈర్లపల్లి గ్రామంలో టిడిపి నేత భాస్కర్‌రెడ్డిపై వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బాస్కర్ రెడ్డిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు.

భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల మధ్య ఈర్లపల్లి గ్రామంలో చాలా కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది.వీరిద్దరి మధ్య గతంలో అనేక గొడవలు చోటుచేసుకొన్నాయి. అయితే గురువారం నాడు ఇరు వర్గాల మధ్య పంచాయితీ రాజీ విషయమై ఈ ఘటన చోటుచేసుకొందని స్థానికులు చెబుతున్నారు.

Ysrcp leader Srinivas Reddy fired on Tdp leaders Bhaskar Reddy

భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు ఓ పంచాయితీ విషయంలో రాజీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకొందని సమాచారం. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ఈ తరుణంలోనే శ్రీనివాస్ రెడ్డి భాస్కర్‌రెడ్డి పై కాల్పులు జరిపారు. భాస్కర్ రెడ్డితో పాటు ఆయన బంధువు వాసుదేవ రెడ్డిపై శ్రీనివాస్ రెడ్డిపై కాల్పులు జరిపారు.

శ్రీనివాస్ రెడ్డి భాస్కర్ రెడ్డి, వాసుదేవరెడ్డి కాళ్ళపై ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితులను వెంటనే ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిని ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఘటన స్థలం నుండి పారిపోయారని పోలీసులు చెబుతున్నారు.

English summary
Ysrcp leader Srinivas Reddy fired on Tdp leaders Bhaskar Reddy and his relative Vasudeva Reddy on Thursday evening.Bhasker reddy and vasudeva Reddy under treatment in Proddutoor hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X