అమెరికా సెక్స్ రాకెట్ వెనుక పెద్దల హస్తం, చంద్రబాబు సమాధానం చెప్పాలి: వాసిరెడ్డి పద్మ
అమరావతి: తెలుగుదేశం పార్టీలోని వ్యక్తులు, పార్టీలోని సన్నిహితులు అమెరికా సెక్స్ రాకెట్ నడుపుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ గురువారంసంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీని అత్యంత ప్రమాదకర పార్టీగా పరిగణించాలని విమర్శించారు. అంతర్జాతీయస్థాయిలో తెలుగువారి పరువు పోగొడుతున్నారని నిప్పులు చెరిగారు.
అమెరికా సెక్స్ రాకెట్లో టీడీపీ నేత విచారణపై సమాధానం చెప్పాలి
అమెరికా సెక్స్ రాకెట్ విషయంలో టీడీపీ నేత విచారణపై సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తానా అధ్యక్షుడు కోమటి జయరాంను నార్త్ అమెరికాలో తెలుగు ప్రజల ప్రతినిధిగా నియమించారని గుర్తు చేశారు. ఇంత వివాదం నడుస్తుంటే తెలుగు ప్రజల ప్రతినిధి ఏం చేస్తున్నారని నిలదీశారు.
రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు కానీ
కాల్మనీ సీఎం అన్నందుకు తమ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసును నీరుగార్చారన్నారు. ఇప్పుడు ప్రతి మహిళ కాల్ మనీ సీఎం అనే స్థాయికి తీసుకు వచ్చారని విమర్శించారు.
Recommended Video
చికాగో సెక్స్ రాకెట్ వెనుక పెద్దల హస్తం
చికాగో సెక్స్ రాకెట్ వెనుక పెద్దల హస్తం ఉందని వాసిరెడ్డి పద్మ అన్నారు. తానా అధ్యక్షులు వేమన సతీష్ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) ప్రశ్నించినట్లుగా తెలుస్తోందని చెప్పారు. వేమన సతీష్.. చంద్రబాబు, లోకేష్లకు అత్యంత సన్నిహితుడు అన్నారు. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందన్నారు.
అమెరికాలోని తెలుగువారి పరువు తీశారు
అమెరికాలో ఉన్న తెలుగువారి పరువు తీశారని వాసిరెడ్డి పద్మ అన్నారు. అమరావతిలో, జాతీయస్థాయిలో, అంతర్జాతీయస్థాయిలో ఏపీ పరువు తీస్తున్నారన్నారు. కాల్ మనీ కేసులో టీడీపీ నేతలు ఉండటం వల్లే కేసును నీరుగార్చారన్నారు. కాగా, ఇటీవల అమెరికా సెక్స్ రాకెట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.