వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సదావర్తి భూములు: హైకోర్టు ఆదేశాలతో రూ.27.44 కోట్లు చెల్లించిన ఎమ్మెల్యే ఆళ్ళ

సదావర్తి భూముల విషయంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రూ.17.44 కోట్లను దేవాదాయశాఖకు చెల్లించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సదావర్తి భూముల విషయంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రూ.17.44 కోట్లను దేవాదాయశాఖకు చెల్లించారు. రెండు విడతల్లో ఈ భూమికి రూ. 27.44 కోట్లను దేవాదాయశాఖ ఖాతాకు జమచేశారు.

సదావర్తి భూముల కేసు: రూ. 10 కోట్లు చెల్లించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళసదావర్తి భూముల కేసు: రూ. 10 కోట్లు చెల్లించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ

సదావర్తి భూముల వేలం వ్యవహరంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. దీంతో గతంలో చెల్లించిన మొత్తం కంటే అదనంగా రూ. 10 కోట్లు చెల్లిస్తే ఆ భూములను మీకే కేటాయిస్తామని హైకోర్టు చెప్పింది.

 Ysrcp Mla Alla Ramakrishna reddy pays Rs. 27.44 crore to Endowment

ట్విస్ట్: 2 వారాల్లో రూ. 10 కోట్లు చెల్లిస్తే సదావర్తి భూములు మీకే : హైకోర్టుట్విస్ట్: 2 వారాల్లో రూ. 10 కోట్లు చెల్లిస్తే సదావర్తి భూములు మీకే : హైకోర్టు

అయితే దీనికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి సానకూలంగా స్పందించారు. గతంలోనే రామకృష్ణారెడ్డి రూ. 10 కోట్లను చెల్లించారు. శుక్రవారం నాడు రూ.17.44 కోట్లను దేవాదాయశాఖ ఖాతాలో జమ చేశారు. ఎంతో విలువైన సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కొందరు తమ అనుయాయులకు రూ.22 కోట్లకు ధారదత్తం చేసిందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన రూ.27.44 కోట్లను చెల్లించారు.

English summary
Ysrcp Mla Alla Ramakrishna reddy paid Rs. 27.44 crore to Endowment department on Friday. As per the High court orders He paid Rs 27.44 crores with two phases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X