సదావర్తి భూములు: హైకోర్టు ఆదేశాలతో రూ.27.44 కోట్లు చెల్లించిన ఎమ్మెల్యే ఆళ్ళ
సదావర్తి భూముల విషయంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రూ.17.44 కోట్లను దేవాదాయశాఖకు చెల్లించారు.
హైదరాబాద్: సదావర్తి భూముల విషయంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రూ.17.44 కోట్లను దేవాదాయశాఖకు చెల్లించారు. రెండు విడతల్లో ఈ భూమికి రూ. 27.44 కోట్లను దేవాదాయశాఖ ఖాతాకు జమచేశారు.
సదావర్తి భూముల కేసు: రూ. 10 కోట్లు చెల్లించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ
సదావర్తి భూముల వేలం వ్యవహరంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. దీంతో గతంలో చెల్లించిన మొత్తం కంటే అదనంగా రూ. 10 కోట్లు చెల్లిస్తే ఆ భూములను మీకే కేటాయిస్తామని హైకోర్టు చెప్పింది.
ట్విస్ట్: 2 వారాల్లో రూ. 10 కోట్లు చెల్లిస్తే సదావర్తి భూములు మీకే : హైకోర్టు
అయితే దీనికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి సానకూలంగా స్పందించారు. గతంలోనే రామకృష్ణారెడ్డి రూ. 10 కోట్లను చెల్లించారు. శుక్రవారం నాడు రూ.17.44 కోట్లను దేవాదాయశాఖ ఖాతాలో జమ చేశారు. ఎంతో విలువైన సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కొందరు తమ అనుయాయులకు రూ.22 కోట్లకు ధారదత్తం చేసిందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన రూ.27.44 కోట్లను చెల్లించారు.