''జేబులు నింపుకోవడం కోసమే...ప్రత్యేక హోదాను పక్కను పెట్టారు''
జేబులు నింపుకోవడం కోసమే ప్రత్యేక హోదాను చంద్రబాబునాయుడు విస్మరించారని వైఎస్ఆర్ సిపి ఎంఏల్ఏ ఎంఏల్ఏ గిడ్డి ఈశ్వరి ఆరోపించారు.
విశాఖపట్టణం:ప్రత్యేక హోదా కోసం ప్రజలు రెండేళ్ళుగా పోరాటం చేస్తోంటే ఎందుకు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నారని ఎపి సిఎం చంద్రబాబునాయుడిని నిలదీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ గిడ్డి ఈశ్వరి.
జేబులు నింపుకోవడం కోసమే ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబునాయుడు ఒప్పుకొన్నారని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో బిజెపి నేత వెంకయ్యనాయుడితో కలిసి ప్రత్యేక సాధిస్తే తప్ప ఆంద్రప్రదేశ్ అభివృద్ది సాధించలేదని చేసిన ప్రసంగాలను ఆమె గుర్తుచేశారు.
మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదా ఆమె గుర్తుచేశారు. చంద్రబాబు విపక్షాల పట్ల వివక్ష చూపుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు రెండున్నర ఏళ్ళుగా పోరాడుతున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించాలని ఆందోళన చేస్తున్నవారిని చంద్రబాబు ప్రభుత్వం భయపెడుతోందని ఆమె ఆరోపించారు.
ప్రత్యేక హోదా కోసం ప్రజలు రెండేళ్ళుగా పోరాటం చేస్తోంటే ఎందుకు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నారని ఎపి సిఎం చంద్రబాబునాయుడిని నిలదీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ గిడ్డి ఈశ్వరి.