వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నేత పిల్లి సుభాష్ ఇంట విషాదం - బ్రెయిన్ స్ట్రోక్‌తో ఎంపీ సతీమణి కన్నుమూత

|
Google Oneindia TeluguNews

వైసీపీ సీనియర్ నేత, సీఎం జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడైన రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట పెను విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సుభాష్ సతీమణి సత్యనారాయణమ్మ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమెను హైదరాబాద్ లో ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో అనూహ్య ఇబ్బందులు తలెత్తడంతో చివరికి ఆమె చనిపోయారు.

ఏపీలో దారుణం: ఆడవాళ్లను అంగడి సరుకులా - ఆర్థిక నేరాల్లో టాప్ - ఎన్‌సీఆర్‌బీ రిపోర్టులో సంచలనాలుఏపీలో దారుణం: ఆడవాళ్లను అంగడి సరుకులా - ఆర్థిక నేరాల్లో టాప్ - ఎన్‌సీఆర్‌బీ రిపోర్టులో సంచలనాలు

బ్రెయిన్ స్ట్రోక్ అంటూ..

బ్రెయిన్ స్ట్రోక్ అంటూ..

ఎంపీ సుభాష్ చంద్రబోస్ సతీమణి సత్యనారాయణమ్మ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆదివారం ఉదయం ఆమెకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు డాక్టర్లు పేర్కొన్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఎంపీ ఇంట్లో విషాదం..

ఎంపీ ఇంట్లో విషాదం..

పిల్లి సుభాష్ భార్య సత్యనారాయణమ్మ మరణంతో వారి ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంపీ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పిల్లి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కీలక నేత కుటుంబంలో విషాదంపై వైసీపీ శ్రేణులు విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఆయన కీలకంగా వ్యవహరించి ఉండటంతో తెలంగాణకు చెందిన పలువురు నేతలు సైతం సంతపాలు తెలిపారు.

చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజేచంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే

Recommended Video

Free Crop Insurance Scheme ఉచిత పంటల భీమా పథకం అమలుకు నిర్ణయం AP Govt,వైఎస్ఆర్ జలకళలో మార్పులు...!!
స్వగ్రామంలోనే అంత్యక్రియలు..

స్వగ్రామంలోనే అంత్యక్రియలు..

ఆదివారం ఉదయం కన్నుమూసిన సత్యనారాయణమ్మ భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నాడు అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. మరోవైపు.. వైసీపీ పెద్దలు, జిల్లా నేతలు ఎంపీ సుభాష్ కు ఫోన్లు చేసి పరామర్శించారు.

English summary
YSRCP Rajya Sabha member Pilli Subhash Chandra Bose's wife Satyanarayanamma passed away on Sunday. She was treated at a private hospital in Hyderabad for the past few days and passed away today due to a brain stroke. Her death cast a dark shadow over the mp's home. including cm jagan, several ysrcp leaders expressed condolences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X