వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14 సంవత్సరాల పాటు సీఎం: కేడర్‌కు క్రిమినల్ సలహాలు: ఇదేనా అనుభవం: విజయసాయి రెడ్డి

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు ఘాటు విమర్శలను సంధించారు. పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ చంద్రబాబు.. జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ కేడర్‌కు సూచించడాన్ని తప్పు పట్టారు. అధ్యక్షుడి స్థానంలో ఉన్న నాయకుడు పార్టీ కార్యకర్తలకు.. మంచిని సూచిస్తుంటారని, చంద్రబాబు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

చంద్రుడి శిలలను మోసుకొచ్చిన చైనా స్పేస్‌క్రాఫ్ట్: భూమిపై ల్యాండ్: ఇక చైనా టార్గెట్ అదేచంద్రుడి శిలలను మోసుకొచ్చిన చైనా స్పేస్‌క్రాఫ్ట్: భూమిపై ల్యాండ్: ఇక చైనా టార్గెట్ అదే

ఉమ్మడి రాష్ట్రానికి, సీమాంధ్రకు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం చంద్రబాబుకు ఉందని, సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా, ఓ ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అలాంటి వ్యక్తి.. పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఆదేశాలను జారీ చేయడం సిగ్గుచేటని అన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు క్రిమినల్ సలహాలు ఇవ్వడం అభ్యంతరకరమని ఆయన వ్యాఖ్యానించారు.

 YSRCP MP Vijayasai Reddy slams TDP Chief Chandrababu for his comments on Police

పోలీసుల మీద కేసులు పెట్టాలని, వారిని కాళ్ల బేరానికి రప్పించుకోవాలనే ఆలోచన తీరు.. విధానం సరికాదని సాయిరెడ్డి అన్నారు. ఏ నాయకుడైనా తమ పార్టీ కార్యకర్తలకు ప్రజల మనసులు గెలవాలని సలహా ఇస్తారని, చంద్రబాబు మాత్రం తాను భిన్నంగా వ్యవహరిస్తానని మరోమారు నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులను బ్లాక్‌మెయిల్ చేయడం, దాని ద్వారా వారిని తమ ఆధీనంలోకి తీసుకుని రావాలనుకోవడం సరికాదని అన్నారు.

Recommended Video

Janasena BJP Support To Amaravati Farmers, Plans Janabheri Meeting

జూమ్ వీడియో ద్వారా చంద్ర‌బాబు చేసే నీచ కుట్ర రాజ‌కీయం మరోసారి బ‌ట్ట‌బ‌య‌లయిందని సాయిరెడ్డి ధ్వజమెత్తారు. తన రాజకీయ అనుభవంతో రాష్ట్రాభివృద్ధికి సూచనలు ఇస్తూ, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించకుండా.. బాధ్యతారహితంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కార్య‌కర్త‌ల‌ను రెచ్చ‌గొట్టడమే పనిగా పెట్టుకున్నారని, పోలీసుల‌పై కేసులు పెట్టి వేధించాలని దిశా నిర్దేశం చేయడాన్ని చూస్తోంటే.. ఆయన ఎంతగా దిగజారారో తెలుస్తోందని అన్నారు.

English summary
YSR Congress Party MP Vijayasai Reddy slams Telugu Desam Party Chief Chandrababu for his comments on Police and advised to the Party's cadre to file case against Police in the State. Vijayasai Reddy said that Chandrababu giver criminal advised to his Party cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X