వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రభుత్వానికి చెప్పండి!: నేడు రాష్ట్రపతిని కలవనున్న వైసీపీ ఎంపీలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం తదితర అంశాలను వారు ఆయన దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. విభజన సమయంలో ఇచ్చిన ఏ హామీలు అమలు కాని విషయాన్ని ఆయనకు తెలియజేయనున్నారు.

Recommended Video

2019లో అధికారంలోకి వచ్చేది మేమే : విజయసాయి రెడ్డి

ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న వైసీపీ ఎంపీలు మధ్యాహ్నం రాష్ట్రపతిని కలసి ఓ మెమొరాండం సమర్పిస్తారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నదే తమ డిమాండ్ అని చెప్పనున్నారు. వాటిని నెరవేర్చాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి సూచించాలని కోరనున్నారు.

YSRCP MPs to meet President Kovind today

విభజన హామీలపై తాము రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు వచ్చామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 2019 ఎన్నికల అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు.

English summary
YSR Congress Party MPs and leaders will meet President Ramnath Kovind today afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X