వైసీపీ ఏడాది పాలన .. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు,సదస్సులు .. షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు అధికార టీడీపీని వద్దని వైసీపీకి ప్రజలు పట్టం కట్టిన రోజిది . ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేయగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన రోజు నేడు . ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అటు వైసీపీ శ్రేణులు సంబరాలలో ఉన్నాయి. వైసీపీ ఏడాది పాలనకు కితాబిస్తున్నాయి. ఏపీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని వైసీపీకి అధికారం కట్టబెట్టి నేటికి ఏడాది కావటంతో ఇక ఈ నేపధ్యంలోనే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ, బీజేపీ నేతల విసుర్లు .. ఎవరేమన్నారంటే
కార్యక్రమాల షెడ్యూల్ ను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఇక ఈ కార్యక్రమాల షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. ఈ మేరకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు రోజుల పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. ఏడాది కాలంగా వై సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు , అలాగే వివిధ పథకాల అమలు తీరుపై సదస్సులు నిరహింహాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మెరుగైన పాలనకు ఈ సదస్సుల ద్వారా సూచనలు ,సలహాలు తీసుకోనున్నారు.
ఈ నెల 25 నుండి 30 వరకు సదస్సులు , ప్రత్యేక కార్యక్రమాలు
ఇక అందులో భాగంగా ఈ నెల 25 నుండి 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు . 25న పరిపాలన సంస్కరణలు-సంక్షేమం పై సదస్సు నిర్వహించనున్నారు . వైసీపీ పాలన సాగిస్తున్న నాటి నుండి వివిధ రంగాలలో చేపట్టిన పాలనా సంస్కరణలపై , అలాగే అందిస్తున్న సంక్షేమంపై సదస్సు నిర్వహించనున్నారు . ఇక 26న వ్యవసాయం-అనుబంధ రంగాలు, 27న విద్యారంగం సంస్కరణలు-పథకాలు, 28 న పరిశ్రమలు-పెట్టుబడుల రంగం, 29న వైద్య ఆరోగ్య రంగం సంస్కరణలు-పథకాలపై సదస్సులు నిర్వహించనున్నారు.
30 న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్న సీఎం
ఇక అంతే కాదు 30న సీఎం జగన్ బాధ్యత చేపట్టిన రోజు కావటంతో ఆ రోజు రైతు భరోసా కేంద్రాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. మొదటి నుండి రైతు సంక్షేమం విషయంలో తండ్రి బాటనే అనుసరిస్తున్న తనయుడిగా ఆ రోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు సీఎం జగన్ . అయితే ఈ సదస్సులన్నీ కరోనా లాక్ డౌన్ సమయం కావటంతో ఆన్ లైన్ పద్దతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగిన ఏర్పాట్లను చేస్తుంది .
Recommended Video
ఆరు రోజులు ఆన్ లైన్ లో సదస్సుల్లో పాల్గొననున్న సీఎం జగన్
ఇక ఆరు రోజుల పాటు జరగనున్న అన్ని సమావేశాలలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆన్ లైన్ పద్దతిలో సదస్సులను ప్రభుత్వం నిర్వహించనున్న నేపధ్యంలో ప్రతి రోజు ఈ సదస్సులలో పాల్గొని అభిప్రాయాలను తెలుసుకుంటారు. మెరుగైన పాలనకు కావాల్సిన సూచనలు , సలహాలు తీసుకుంటారు. ఇక జిల్లా స్థాయిలో ఇంచార్జ్ మంత్రి, మంత్రులు, లబ్ధిదారులతో సదస్సులు జరగనున్నాయి. ఇక ఈ సదస్సులకు భౌతిక దూరం పాటిస్తూ 50 మంది మాత్రమే పాల్గొనాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏది ఏమైనా ఎన్ని సమస్యలు వచ్చినా ఎక్కడా ఆగకుండా పాలనలో తన మార్క్ ను , దూకుడును చూపిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని వైసీపీ శ్రేణులు సంతోషంలో ఉన్నాయి.