చంద్రబాబు పని సంతోషమే కానీ, ఓటుకు నోటు కేసు ఎదుర్కో: పెద్దిరెడ్డి
చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంకు నీళ్లు అందిస్తున్నారని, ఇది సంతోషమేనని, అయితే పక్క నియోజకవర్గాల రైతుల సంగతేమిటని వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రశ్నించారు.
నినాదాలు సరే, వెళ్లి చూడండి: పవన్కు వెంకయ్య, నోరు జాగ్రత్త.. శివాజీకి టిడిపిఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఏ తప్పూ చేయకపోతే హైకోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఏసీపీ న్యాయస్థానం విచారణపై స్టే ఎందుకు తెచ్చుకున్నారో చెప్పాలన్నారు. తప్పు చేయకుంటే కేసును ధైర్యంగా ఎందుకు ఎదుర్కోలేదని అడిగారు. చంద్రబాబు నిప్పు అయితే కేసును ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. పంటలు ఎండిపోయిన తరువాత రెయిన్ గన్లు ఎందుకని విమర్శలు గుప్పించారు.
టిడిపిపై సిద్ధార్థనాథ్ సింగ్
ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న టిడిపి తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని బీజేపీ నేతలు ఏపీ బీజేపీ నేతలకు సూచించారు. ప్రత్యేక హోదా పైన వారం రోజుల్లో స్పష్టత వస్తుందని ఏపీ బీజేపీ ఇంచార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు.
కేంద్రం నిధులు ఇవ్వడం లేదని టిడిపి దుష్ప్రచారం చేస్తోందని, ఇది సరికాదని ఏపీ బీజేపీ నేతలు... సిద్ధార్థనాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. టిడిపి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు.