మీ తండ్రి సచిన్ కాళ్లు పట్టుకున్నది మర్చిపోయారా?: బండ్ల గణేష్ అరెస్టుకు వైసీపీ డిమాండ్
Recommended Video
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేశ్కు, వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మధ్య జరిగిన మాటల యుద్దం జనాన్ని నోరెళ్లబెట్టేలా చేసింది. ప్రస్తావించడానికి కూడా వీల్లేని రీతిలో ఇద్దరూ దిగజారుడు విమర్శలు చేసుకున్నారు.
టీవి9 వేదికగా జరిగిన ఆ తతంగం చాలామందికి రోత పుట్టించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ను అరెస్ట్ చేయాలని వైసీపీ మహిళా నేతలు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
ముదిరిన 'బండ్ల-రోజా' వివాదం: సోషల్ మీడియాలోకి ఎక్కిన ఫోన్ నంబర్..
ఫిర్యాదు అనంతరం వైసీపీ మహిళ నేత బండి పుణ్యశీల మీడియాతో మాట్లాడారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారని, ఆయనకు ధైర్యముంటే ఫోన్ స్విచ్చాన్ చేయాలని విరుచుకుపడ్డారు. బండ్ల గణష్ విజయవాడ వచ్చి మాట్లాడాలని, అసలు ఆంధ్రా రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయననకేంటని ప్రశ్నించారు.
'మీ పై హీరోయిన్ మీరా చోప్రా చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా? మీపై హీరో సచిన్ జోషి పెట్టిన కేసు విషయమై మీ తండ్రి హీరో కాళ్లు పట్టుకున్నసంగతి మర్చిపోయారా?' అని బండ్ల గణేష్ ను నిలదీశారు. రోజాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.