హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై హత్యా ప్రయత్నం, బాబు వైపు వేలు: కీలక పాయింట్లు లాగిన వైవీ సుబ్బారెడ్డి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి ఘటనను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో అన్నారు. దాడిపై చంద్రబాబు వెకిలిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

<strong>కొత్త నాయకుడి ప్లాన్ చెప్తా, వైసీపీలో వారిని పక్కనపెట్టండి, సీఎం అవుతారు: జగన్‌పై శివాజీ</strong>కొత్త నాయకుడి ప్లాన్ చెప్తా, వైసీపీలో వారిని పక్కనపెట్టండి, సీఎం అవుతారు: జగన్‌పై శివాజీ

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే దర్యాఫ్తుపై తమకు నమ్మకం లేదని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రోద్బలంతోనే ఈ హత్యాయత్నం జరిగిందని చెప్పారు. నిందితుడు శ్రీనివాస్‌కు టీడీపీ సభ్యత్వం ఎలా ఉందని ప్రశ్నించారు. నిందితుడి వెనుక అధికార పార్టీ ఉందని చెప్పారు. స్వతంత్ర సంస్థతో దర్యాఫ్తు, జగన్‌కు భద్రత ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్పారు.

ఏపీ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు

ఏపీ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపే విచారణపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. థర్డ్ పార్టీ దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. జగన్ చేస్తున్న యాత్రకు అనూహ్య స్పందన రావడాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు.

హత్యాప్రయత్నంపై వైవీ సుబ్బారెడ్డి పాయింట్లు

హత్యాప్రయత్నంపై వైవీ సుబ్బారెడ్డి పాయింట్లు

జగన్ పైన హత్యాయత్నం జరిగింది ఏపీలో అని, హత్య జరిగింది ప్రతిపక్ష నేత పైన, విమానాశ్రయంలోని సీఐఏ మోడీ పరిధిలో ఉంటుందని, లోపల అంతా లోకల్ పోలీసు చూసుకుంటుందని అలాంటప్పుడు కేంద్రంపై వేసి తప్పుకోవాలని చంద్రబాబు చూశారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అరెస్టు చేసింది ఎవరో చూడాలని, అక్కడ ఏపీ పోలీసులు ఉన్నారని చెప్పారు. కేవలం దాడి నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని, కేంద్రంపైకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. జగన్ పైన హత్యాయత్నం వెనుక ఎంత పెద్దవారు ఉన్నా చర్యలు తీసుకోవాలని తాము కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరుతామని, అలాగే జగన్ భద్రతపై దృష్టి సారించాలని కోరుతామని చెప్పారు.

 ఏపీలో హత్యాయత్నం, అందుకే ఢిల్లీకి చంద్రబాబు

ఏపీలో హత్యాయత్నం, అందుకే ఢిల్లీకి చంద్రబాబు

హత్యాప్రయత్నం వెనుక చంద్రబాబు ఉన్నారని తమ అనుమానామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అందుకే విచారణ వద్దని చెప్పేందుకు ఆయన ఢిల్లీలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ దాడిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ హత్యాయత్నం జరిగింది ఏపీలో అన్నారు.

అందుకే ప్రజా సంకల్పయాత్ర సమయంలో దాడి జరగలేదు

అందుకే ప్రజా సంకల్పయాత్ర సమయంలో దాడి జరగలేదు

పాదయాత్రలో జగన్ పైన దాడి చేస్తే అక్కడున్న వేలాదిమంది ప్రజలు కొడితే ఎముకలు కూడా దొరకవనే అభిప్రాయంతో, అదే సమయంలో విమానంలో ఎవరూ ఉండరనే ఉద్దేశ్యంతో అక్కడ దాడి చేశారని చెప్పారు. కానీ తాము అలా చేసేవాళ్లం కాదన్నారు. తాము ఎవరి డైరెక్షన్లో నడవడం లేదని, ప్రజల డైరెక్షన్లో నడుస్తున్నామని చెప్పారు. రిమాండ్ రిపోర్టులో సగం వాస్తవాలు బయటకు వచ్చాయని చెప్పారు. 2015లో నిందితుడు శ్రీనివాస రావుపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి ఎయిర్ పోర్టులో ఉద్యోగం ఉండవద్దని, కానీ ఎలా ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. టిట్లీ తుఫాను సహాయక చర్యల్లో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.

English summary
YSR Congress Party leader YV Subba Reddy says no to AP government inquiry on YS Jagan attack case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X