Politician: గత ఏడాది లవ్ మ్యారేజ్, మామకు వ్యతిరేకంగా రాజకీయాలు, రాత్రి పక్కాప్లాన్ తో నరికేసి, ప్రతీకారం!
బెంగళూరు/హుబ్బళి: గ్రామ పంచాయితీ సభ్యుడు అతని సొంతపనులు చేసుకుంటూ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నాడు. రాజకీయాల్లో ఉంటున్న ఓ లీడర్ కూతురిని గ్రామ పంచాయితీ సభ్యుడు గత ఏడాది లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇటీవల పంచాయితీ అధ్యక్షుడు, ఉపాద్యక్షుడి ఎన్నికల విషయంలో రచ్చరచ్చ జరిగింది. రాత్రి గ్రామ పంచాయితీ సభ్యుడు పని ముగించుకుని స్నేహితులతో మాట్లాడిన తరువాత బైక్ లో ఇంటికి వెలుతున్నాడు.
మార్గం మద్యలో ఒక్కసారిగా చుట్టుముట్టిన కొందరు వ్యక్తులు కత్తులు, వేటకొడవళ్లు తీసుకుని గ్రామ పంచాయితీ సభ్యుడిని ఇష్టం వచ్చినట్లు నరికేశారు. తీవ్రగాయాలైన గ్రామ పంచాయితీ సభ్యుడిని ఆసుపత్రికి తరలించగా అతని ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ACB: మాజీ మంత్రి, ఎమ్మెల్యేకి చుక్కలు చూపించిన ఏసీబీ, ఇల్లు, గెస్ట్ హౌస్, అపార్ట్ మెంట్, ఆఫీసుల్లో
పొలిటికల్ లీడర్
కర్ణాటకలోని హుబ్బళి నగరంలో శివాజీ పటాదారి అలియాస్ శివాజీ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. హుబ్బళి సమీపంలోని రాయనపాళ్య గ్రామపంచాయితీ వార్డు మెంబర్ గా పోటీ చేసిన శివాజీ విజయం సాధించాడు. రాయనపాళ్య గ్రామ పంచాయితీ సభ్యుడు శివాజీ అతని సొంతపనులు చేసుకుంటూ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నాడు.
గత ఏడాది పొలిటికల్ లీడర్ లవ్ మ్యారేజ్
రాజకీయాల్లో ఉంటున్న శివాజీ హుబ్బళిలో నివాసం ఉంటున్న యల్లప్ప మేటి కుటుంబ సభ్యుల అమ్మాయి రూపా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని ప్రేమించాడు. కుటుంబ సభ్యులు పెళ్లికి వ్యతిరేకించడంతో గత ఏడాది చివరిలో శివాజీ, రూపా లవ్ మ్యారేజ్ చేసుకుని హుబ్బళిలోనే ప్రత్యేకంగా కాపురం ఉంటున్నారు.
రాత్రి పక్కాప్లాన్ తో లేపేసిన ప్రత్యర్థులు
సోమవారం రాత్రి గ్రామ పంచాయితీ సభ్యుడు శివాజీ పని ముగించుకుని స్నేహితులతో మాట్లాడిన తరువాత బైక్ లో ఇంటికి వెలుతున్నాడు. మార్గం మద్యలో పాత హుబ్బళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా చుట్టుముట్టిన కొందరు కత్తులు, వేటకొడవళ్లు, తల్వార్లు తీసుకుని గ్రామ పంచాయితీ సభ్యుడు శివాజీ మీద దాడి చేసి అతన్ని ఇష్టం వచ్చినట్లు నరికేశారు.
శివాజీ హంతకులు అతని భార్య కుటుంబ సభ్యులు
తీవ్రగాయాలైన గ్రామ పంచాయితీ సభ్యుడు శివాజీని హుబ్బళిలోని కిమ్స్ ఆసుపత్రికి తరించారు. కిమ్స్ ఆసుపత్రికి తరలించిన కొంత సేపటికి శివాజీ ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివాజీ హత్య కేసులో ప్రవీణ్, యల్లప్ప మేటి, గ్రామ పంచాయితీ సభ్యుడు రుద్రప్ప మేటీ, మల్లికార్జున మేటి, శివు మేటి అనే ఐదు మందిని అరెస్టు చేశామని పాత హుబ్బళి పోలీస్ స్టేషన్ అధికారులు అన్నారు.
లవ్ మ్యారేజ్, రాజకీయ కక్షలు
హత్య చేసిన మేటీ కుటుంబ సభ్యుల అమ్మాయిని శివాజీ పెళ్లి చేసుకున్నాడని, ఇటీవల పంచాయితీ అధ్యక్షుడు, ఉపాద్యక్షుడి ఎన్నికల విషయంలో శివాజీ మేటి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పని చెయ్యడంతో అప్పట్లో రచ్చరచ్చ అయ్యిందని, అన్ని విషయాలు మనసులో పెట్టుకుని శివాజీని హత్య చేసి ఉంటారని పోలీసు అధికారులు అంటున్నారు.