బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Owner: ఫైనాన్స్ కంపెనీ యజమాని దారుణ హత్య, ఫ్రెండ్ ఎస్కేప్, ఆఫీసులో ఏంజరిగిందంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ఉడిపి: ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ యజమాని, ప్రముఖ వ్యాపారిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. ప్రతిరోజు ఫైనాన్స్ కంపెనీలో రాత్రి 10 గంటల వరకు లావాదేవీలు చూసుకుంటున్న వ్యక్తి తరువాత ఇంటికి వెలుతున్నాడు. రాత్రి 12 గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో వ్యాపారి కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు ఫైనాన్స్ కంపెనీ ఆఫీసు దగ్గరకు వెళ్లారు. ఫైనాన్స్ కంపెనీలోని సోఫాలో వ్యాపారి గొంతు కోసి అతి దారుణంగా హత్యకు గురి అయ్యాడని వెలుగు చూడటం కలకం రేపింది.

Illegal affair: భార్య ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్, భర్త ఆంటీల టెక్నీషియన్, రివర్స్ !Illegal affair: భార్య ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్, భర్త ఆంటీల టెక్నీషియన్, రివర్స్ !

ఫేమస్ ఫైనాన్స్ కంపెనీ

ఫేమస్ ఫైనాన్స్ కంపెనీ

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కుందాపుర తాలుకాలోని సళ్వాడిలో అజేంద్ర శెట్టి (33) అనేయువకుడు అతని స్నేహితుడు, సాటి వ్యాపారి అనూప్ తో కలిసి డ్రీమ్ ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. అజేంద్ర శెట్టి ఫైనాన్స్ వ్యవహారాలతో పాటు కొన్ని వ్యాపారాలు చేస్తున్నాడు. ఉడిపి జిల్లాలోని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీల్లో అజేంద్ర శెట్టి, అనూప్ నిర్వహిస్తున్న డ్రీమ్ ఫైనాన్స్ కంపెనీ కూడా ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

అనుమానం వచ్చింది

అనుమానం వచ్చింది

ప్రతిరోజు ఫైనాన్స్ కంపెనీలో రాత్రి 10 గంటల వరకు లావాదేవీలు చూసుకుంటున్న అజేంద్ర శెట్టి తరువాత ఇంటికి వెలుతున్నాడు. రాత్రి 12 గంటలు అయినా అజేంద్ర శెట్టి ఇంటికి రాకపోవడంతో వ్యాపారి కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అజేంద్ర శెట్టి ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు ఫైనాన్స్ కంపెనీ దగ్గరకు వెళ్లారు.

గొంతు కోసి చంపేసిన నిందితులు

గొంతు కోసి చంపేసిన నిందితులు

డ్రీమ్ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలోని సోఫాలో అజేంద్ర శెట్టి శవమై కనిపించాడు. ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలోనే అజేంద్ర శెట్టి గొంతు కోసి దారుణంగా హత్య చేశారని గుర్తించిన అతని సోదరుడు మహేంద్ర శెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

వాడే హంతకుడు

వాడే హంతకుడు

అజేంద్ర శెట్టితో కలిసి ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్న పార్ట్నర్ అనూప్ తన సోదరుడు అజేంద్ర శెట్టిని హత్య చేసి ఉంటాడని అతని సోదరుడు మహేంద్ర శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోరెన్సిక్ నిపుణులు, వేలిముద్రల నిపుణులతో సంఘటనా స్థలంలో పరిశీలించి ఆధారాలు సేకరించామని పోలీసులు అన్నారు. వ్యాపారలావాదేవీలలో అవకతవలకు పాల్పడిన అనూప్ ను ప్రశ్నించినందుకే నా సోదరుడు అజేంద్ర శెట్టి హత్యకు గురైనాడని మహేంద్ర శెట్టి ఆరోపిస్తున్నాడు.

ఫ్రెండ్ అనూప్ ఎస్కేప్

ఫ్రెండ్ అనూప్ ఎస్కేప్

అజేంద్ర శెట్టి హత్యకు గురైన తరువాత అతని వ్యాపార భాగస్వామి అనూప్ మాయం కావడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కుందాపుర పోలీసులు అంటున్నారు. అజేంద్ర శెట్టి హత్యకు ఆర్థిక లావాదేవీలు కారాణమా, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ నిర్వహకుడు, వ్యాపారి అజేంద్ర శెట్టి హత్యకు గురి కావడంతో ఉడిపి జిల్లాలో కలకలం రేపింది.

English summary
Dream finance company owner Ajendra Shetty murdered in Kundapura in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X