Illegal affair: ఒకే ఇంట్లో భర్త, ప్రియుడు, డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ తో భార్య బిజీ, సూపర్ ఫిగర్ స్కెచ్ !
బెంగళూరు: కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి భర్తతో కొంత కాలం చక్కగా కాపురం చేసింది. భర్తతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్న భార్య సంతోషంగానే జీవించింది. భర్త స్నేహితుడు కూడా అదే ఇంటిలో ఉంటున్నాడు. సొంతంగా ఆటో తీసుకుని నడుపుతున్న భర్త అతని స్నేహితుడికి సహాయం చెయ్యాలని ఉద్దేశంతో అతన్ని కూడా ఇంట్లో పెట్టుకున్నారు. ఒకే ఆటోను రాత్రి భర్త, పగలు అతని స్నేహితుడు నడుపుతున్నాడు. భర్త ఆటో తోలుతున్న స్నేహితుడు అతని భార్యతో యవ్వారం పెట్టుకున్నాడు. అంతే ఎర్రగా, బుర్రగా చూడటానికి అదిరిపోయే ఫిగర్ మీద కన్ను వేసిన భర్త స్నేహితుడు ఆమెను లైన్ లో పెట్టాడు. ఒకే ఇంట్లో ఉండటంతో ఎవ్వరికీ అనుమానం రాదని భార్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పగలు మొత్తం భర్తను సంతోష పెడుతున్న భార్య రాత్రి అయితే ప్రియుడితో మస్త్ మజా చేసుకుంటూ పండగ చేసుకుంది. పూర్తిగా ప్రియుడి మోజులో పడిపోయిన భార్య ఆమె భర్తను చంపేయాలని డిసైడ్ అయ్యింది. ప్రియుడితో పాటు అతని సోదరుడిని లైన్ లో పెట్టిన భార్య పక్కాస్కెచ్ తో భర్తను చంపించింది.
Illegal affair: భర్తకు అరటి పండు, ప్రియుడికి జామపండు, మిడ్ నైట్ మసాలా, థ్రిల్లర్ సినిమా !
ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి
కర్ణాటకలోని
మండ్య
జిల్లా
మద్దూరు
తాలుకాలోని
అప్పనహళ్ళి
గ్రామంలో
కేవీ.
కార్తీక్
(25)
అనే
యువకుడు
నివాసం
ఉండేవాడు.
కుటుంబ
సభ్యులు
చూపించిన
రంజిత
(24)
అనే
యువతిని
2016లో
కార్తీక్
వివాహం
చేసుకున్నాడు.
కుటుంబ
సభ్యులు
చూసిన
యువకుడు
కార్తీక్
ను
పెళ్లి
చేసుకున్న
రంజిత
భర్తతో
కొంత
కాలం
చక్కగా
కాపురం
చేసింది.
బెంగళూరులో కాపురం
కార్తీక్, రంజిత దంపతులు బెంగళూరు చేరుకుని శ్రీనగర్ సమీపంలోని బృందావన నగర్ లో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. కార్తీక్ సొంతంగా ఆటో తీసుకుని నడుపుకుంటూ భార్య రంజితతో సంతోషంగా జీవిస్తున్నాడు. సొంత ఆటో కావడంతో కార్తీక్ కు ఇష్టం వచ్చినప్పుడు నడుపుతూ, కష్టంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉంటూ భార్య రంజితతో ఎంజాయ్ చేస్తున్నాడు.
ఫ్రెండ్ ఎంట్రీతో మలుపు తిరిగిన కథ
మండ్య
జిల్లాలోని
కేఆర్
పేట్
కు
చెందిన
ఎంఎస్.
సంజు
(28)
అనే
యువకుడు
కార్తీక్
చిన్నప్పటి
నుంచి
ప్రాణస్నేహితులు.
ఒకే
జిల్లా,
పక్కపక్క
తాలుకాలలో
నివాసం
ఉంటున్న
కార్తీక్,
సంజు
అన్ని
విషయాల్లో,
కష్టసుఖాల్లో
కలిసిమెలసి
జీవించారు.
సంజు
కూడా
బెంగళూరు
రావడంతో
అక్కడ
కార్తీక్
కథ
మలుపు
తిరిగింది.
ప్రాణ స్నేహితుడికి సహాయం
సొంతంగా ఆటో తీసుకుని నడుపుతున్న భర్త కార్తీక్ అతని స్నేహితుడు సంజుకు సహాయం చెయ్యాలని అనుకున్నాడు. సంజుకు సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో అతన్ని కార్తీక్ అతని ఇంట్లో పెట్టుకున్నాడు. ఒకే ఆటోను బెంగళూరులో రాత్రి భర్త కార్తీక్, పగలు అతని స్నేహితుడు సంజు నడుపుతున్నారు.
రంజిత మీద భర్త ఫ్రెండ్ కన్నుపడింది
భర్త కార్తీక్ ఆటో తోలుతున్న అతని స్నేహితుడు సంజు ప్రాణ స్నేహితుడి భార్య రంజితతో యవ్వారం పెట్టుకున్నాడు. అంతే ఎర్రగా, బుర్రగా చూడటానికి అదిరిపోయే ఫిగర్ రంజిత మీద కన్ను వేసిన భర్త కార్తీక్ స్నేహితుడు సంజు ఆమెను లైన్ లో పెట్టాడు. రాత్రి పూట కార్తీక్ ఆటో నడపడానికి బయటకు వెళ్లి పోవడంతో ఇంట్లో రంజిత, ఆమె భర్త కార్తీక్ ఫ్రెండ్ సంజు రాత్రి ఇంట్లో ఉంటున్నారు.
రాత్రి ఫ్రెండ్ భార్యతో ఫుల్ రొమాన్స్
ఒకే ఇంట్లో ఉండటంతో ఎవ్వరికి అనుమానం రాదని కార్తీక్ భార్య రంజిత కూడా భర్త ఫ్రెండ్ సంజుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాత్రి భర్త కార్తీక్ ఆటో ఎత్తుకుని బయటకు వెళ్లిపోతే ఇంటి తలుపు లోపల లాక్ చేసుకుంటున్న భార్య రంజిత భర్త ఫ్రెండ్ సంజుతో జల్సా చేసింది. పగలు మొత్తం భర్త కార్తీక్ ను సంతోష పెడుతున్న భార్య రంజిత రాత్రి అయితే ప్రియుడు సంజుతో పండగ చేసుకుంటూ మస్త్ మజా చేసింది.
ప్రియుడి మోజులోపడి భర్త హత్యకు స్కెచ్
పూర్తిగా ప్రియుడు సంజు మోజులో పడిపోయిన భార్య రంజిత ఆమె భర్త కార్తీక్ ని చంపేయాలని డిసైడ్ అయ్యింది. కార్తీక్ ను చంపేస్తే జీవితాంతం సంజుతో కలిసి ఉండవచ్చని ప్లాన్ వేసిన రంజిత ఆ విషయం ప్రియుడు సంజుకు చెప్పింది. సంజు కజిన్ బ్రదర్, హాసన్ జిల్లా అరకలగూడు తాలుకా రామనాథపురం నివాసి సుబ్రమణ్యం కూడా రంజిత్ కు టచ్ లోకి రావడంతో కార్తీక్ హత్యకు ముగ్గురు కలిసి పక్కాప్లాన్ వేశారు.
మిస్సింగ్ కేసు పెట్టిన భార్య
జులై 29వ తేదీన రాత్రి భర్త కార్తీక్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత కార్తీక్ మాత్రం ఇంటికి తిరిగి వెళ్లలేదు. ఆగస్టు 1వ తేదీన తన భర్త కార్తీక్ కనపడటం లేదని కిలాడి భార్య రంజిత కెంపేగౌడ నగర (కేజీనగర) పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కార్తీక్ కోసం గాలించారు. తన భర్త కార్తీక్ కనపడటం లేదని కేసు పెట్టిన రంజిత ఆమె ప్రియుడు సంజుతో కలిసి తిరుగుతున్న విషయం పోలీసుల కంట్లో పడింది. పోలీసులు కార్తీక్ స్నేహితుడు సంజును అదుపులోకి తీసుకున్నారు.
పార్టీ ఉందని చెప్పి చంపేశారు
జులై 29వ తేదీన రాత్రి స్నేహితుడి బర్త్ డే పార్టీ ఉందని చెప్పిన సంజు, అతని కజిన్ బ్రదర్ సుబ్రమణ్య రంజిత భర్త కార్తీక్ ని పిలుచుకుని వెళ్లి ముగ్గురు మద్యం సేవించారు. తరువాత ఆటోలో కార్తీక్ ను నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లి అతని తల మీద జాక్ రాడ్ తో దాడి చేశారు. కిందపడిపోయిన కార్తీక్ మీద కత్తితో పొడిచి తల మీద బండరాళ్లు వేసి చంపేశారు. కార్తీక్ శవాన్ని గోనె సంచిలో మూటకట్టి ఆటోలో తీసుకెళ్లి రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ సమీపంలోని దొడ్డబెలే రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లో విసిరేసి పరారైనారు.
కిలాడి పెళ్లామ్ ఎస్కేప్
పోలీసుల విచారణలో కార్తీక్ ను తామే హత్య చేశామని రంజిత ప్రియుడు సంజు, అతని కజిన్ బ్రదర్ సుబ్రమణ్య అంగీకరించారు. ప్రియుడు సంజు, అతని కజిన్ బ్రదర్ సుబ్రమణ్యను పోలీసులు అరెస్టు చేశారని తెలుసుకున్న రంజిత పరారైయ్యింది. రంజిత మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మాయం అయిపోందని, ఆమె కోసం గాలిస్తున్నామని బెంగళూరులోని కెంపేగౌడ నగర పోలీసులు తెలిపారు.