Illegal affair: ప్రియుడి భార్యను చంపించిన కల్పన ఆంటీ, ఫ్యాక్షన్ సినిమా స్కెచ్, లక్షలు ఖర్చు !
బెంగళూరు/ బెళగావి/ ముంబాయి: వివాహిత మహిళ ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలం ఆంటీతో ఎంజాయ్ చేసిన ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడు. తనకు ప్రియుడు దూరం అయ్యాడని ఆ మహిళ ఆవేశంతో ఊగిపోయింది. తనకు ప్రియుడు దూరం కావడానికి ఆమె భార్య కారణం అని కక్ష పెంచుకుంది. ప్రియుడి భార్య ప్రస్తుతం గర్బవతి. తనకు ప్రియుడు దగ్గర కావాలంటే అతని భార్యను చంపేయాలని ఆంటీ స్కెచ్ వేసింది. అంతే ప్రియుడి భార్యతో పాటు ఆమె పక్కింటిలో నివాసం ఉంటున్న మహిళను అతి దారుణంగా హత్య చేయించింది. ఫ్యాక్షన్ సినిమాను తలతన్నే రీతిలో జంటహత్యల కేసు అనేక మలుపులు తిరిగింది.
Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!
మరాఠీ ఆంటీతో మస్త్ మజా
కర్ణాటకలోని బెలగావి (మహారాష్ట్ర సరిహద్దు)లోని మాచే గ్రామానికి చెందిన గంగప్ప అలియాస్ గంగ, బెలగావి నగరం సమీపంలోని కలైనట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్న మరాఠీ ముద్దుగుమ్మ కల్పన అనే ఆంటీ గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అసలే మరాఠి ఆంటీ కల్పనా ఎర్రగా, బుర్రగా, బలంగా ఉండటంతో గంగ ఆమెను తగులుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు కల్పన, గంగ కర్ణాటక, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలకు వెళ్లి వస్తూ పిచ్చపాటిగా ఎక్కడపడితే అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేశారు.
చేతులు ఎత్తేసిన ప్రియుడు
కల్పన ఆంటీతో కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసిన గంగ 2019లో రోహిణి (23) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. రోహిణిని పెళ్లి చేసుకున్న తరువాత గంగ అతని ప్రియురాలు కల్పన ఆంటీకి రానురాను దూరం అయ్యాడు. ఇంతకాలం శారీరక సుఖం ఇచ్చిన గంగ దూరం అవుతున్నాడని పసిగట్టిన కల్పన అతన్ని ఎలాగైనా దగ్గర చేసుకోవాలని ప్లాన్ వేసింది. అయితే గంగ మాత్రం కట్టుకున్న భార్య రోహిణికి ద్రోహం చెయ్యలేక కల్పనాకు పూర్తిగా దూరం అయ్యాడు.
ప్రియుడి భార్య రోహిణి హత్యకు స్కెచ్
తన ప్రియుడు గంగ తనకు దగ్గర కావాలంటే అతని భార్య రోహిణిని చంపేయాలని కల్పన స్కెచ్ వేసింది. ప్రస్తుతం రోహిణి గర్బవతి. రోహిణి గర్బవతి అని తెలిసినా ఆమెను వదిలిపెట్టకూడదని, హత్య చేయించి తన ప్రియుడు గంగను దగ్గర చేసుకోవాలని కల్పన కిరాయి హంతకులను ఆశ్రయించింది. మీరు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తాను, రోహిణిని చంపేయండి అంటూ కల్పన ఫ్యాక్షన్ సినిమాలో లేడీ విలన్ లాగా రెచ్చిపోయింది.
ప్రియుడి భార్య, పక్కింటి మహిళ దారుణ హత్య
గతనెలలో రోహిణి, తన పక్కింటిలో నివాసం ఉంటున్న సమీప బంధువు రాజశ్రీ అనే మహిళతో కలిసి గ్రామం సమీపంలో వాకింగ్ చేస్తోంది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు రోహిణి, రాజశ్రీని అడ్డుకున్నారు. తరువాత వెంట తీసుకెళ్లిన కత్తులు, వేటకొడవళ్లు తీసుకుని గంగ భార్య రోహిణి గర్బవతి అని కూడా ఆలోచించకుండా అతి దారుణంగా నరికి చంపేశారు. రోహిణిని హత్య చేస్తున్న సమయంలో హంతకులను చూసిన రాజశ్రీ పారిపోవడానికి ప్రయత్నించింది. పోలీసులకు సాక్షం చెబుతుందనే భయంతో నిందితులు రాజశ్రీని వెంటాడి వెంటాడి నరికి చంపేసి అక్కడి నుంచి పారిపోయారు.
బిత్తరపోయిన పోలీసులు
గర్బవతి రోహిణి, ఆమె బంధువు రాజశ్రీ దారుణ హత్య కు గురి కావడంతో బెలగావిలో కలకం రేపింది. బెలగావి సిటీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ విక్రమ్ దుర్గే స్వయంగా రంగంలోకి దిగి కేసు విచారణ చేశారు. ఇద్దరు మహిళలను అతిదారుణంగా ఎవరు హత్య చేశారు ? అని ఆరా తీశారు. గర్బిణి రోహిణితో పాటు రాజశ్రీని హత్య చేయించింది కల్పన అని తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు. వెంటనే కల్పనా ఆంటీని అదుపులోకి తీసుకున్నారు.
నాకు దక్కంది ఎవ్వరికీ దక్కకూడదు... అంతే
తన ప్రియుడు గంగ తన దగ్గరకు రానివ్వకుండా అతని భార్య రోహిణి అడ్డుకుంటున్నదని కల్పన పోలీసులకు చెప్పింది. అందుకే తనకు దక్కంది ఎవ్వరికీ దక్కకూడదు అని నిర్ణయించుకుని కిరాయి హంతకులతో తన మాజీ ప్రియుడు గంగ భార్య రోహిణిని చంపాలని స్కెచ్ వేశానని, అడ్డు వచ్చిన రాజశ్రీని చంపేశామని కల్పన పోలీసుల విచారణలో అంగీకరించింది.
Recommended Video
ఆంటీ అండ్ కో జైలుకు
జంట మహిళల హత్య కేసులో కల్పన ఆంటీతో పాటు కిరాయి హంతకుల ముఠాకు చందిన మహేష్ నాయక్, రాహుల్ పాటిల్, గణేష్ పూర్ కు చెందిన రోహిత్ వాటల్, కలనట్టికి చెందిన షానూర్ పన్నా అనే నిందితులను అరెస్టు చేశామని బెలగావి సిటీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ విక్రమ్ చెప్పారు. మొత్తం మీద ప్రియుడి వ్యామోహంలో అతని భార్యను కిరాయి హంతకులతో కల్పన హత్య చేయించింది అని వెలుగు చూడటంతో బెలగావిలో కలకలం రేపింది. కల్పనతో పాటు కిరాయి హంతకులను బెలగావి సెంట్రల్ జైలుకు పంపించారు.