Illegal affair: భార్యను చంపేసి పుణ్యక్షేత్రంలో మొక్కు తీర్చుకున్న వ్యాపారి, మరిదితో లింక్!
బెంగళూరు: సోదరి భర్తతో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని ఫైనాన్స్ వ్యాపారి రగిలిపోయాడు. పుట్టింటికి వెళ్లి వస్తున్న వివాహిత మహిళ ఆమె మరిదితో జల్సా చేస్తోందని భర్తకు తెలిసింది. భార్యనును ఎలాగైనా చంపేయాలని అనేక ప్రయత్నాలు చేశాడు. విహారయాత్రకు పిలుచుకుని వెళ్లి ఎత్తైన కొండ మీద నుంచి భార్యను కిందకు తోసేసి చంపేయాలని ప్రయత్నించి విఫలం అయ్యాడు. మరోసారి కారుతో తొక్కించి చంపేయాలని ప్రయత్నించాడు. అనేక ప్రయత్నాలు చేసిన భర్త చివరికి అతని భార్యను ఇంట్లోనే గొంతు కోసి దారుణంగా చంపేశాడు.
భార్యను చంపేసిన తరువాత కేసు నుంచి తప్పించాలని పవిత్ర పుణ్యక్షేత్రానికి వెళ్లి అక్కడ ముడికట్టాడు. దేవాలయంలో తలనీలాలు సమర్పించిన తరువాత మూడు పుణ్యక్షేత్రాలు సందర్శించి బంధువుల ఇంటికి వెళ్లి తల దాచుకోవడంతో పోలీసులు పట్టుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం హత్య కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన ఈ ఫైనాన్స్ వ్యాపారి ఇప్పుడు భార్య హత్య కేసులో మరోసారి అరెస్టు అయ్యాడు.
ఐటీ హబ్ లో దంపతులు
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెల్త్ లేఔట్ లో కాంతరాజు, రూపా (36) దంపతులు నివాసం ఉంటున్నారు. 10 సంవత్సరాల క్రితం కాంతరాజు, రూపాకు వివాహం జరిగింది. భార్య రూపాతో హ్యాపీగా కాలం గడుపుతున్నకాంతరాజు కొడుకుతో కలిసి సంతోషంగా ఉండేవాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న కాంతరాజు వ్యాపారం చెయ్యడానికి ఎక్కువగా బయట తిరుగుతున్నాడు.
భార్య మీద అనుమానం
కొంతకాలంగా కాంతరాజు వ్యాపారం పని మీద బయట ఎక్కువగా తిరుగుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా కాంతరాజు, రూపాల దంపతుల కొడుకు ఆన్ లైన్ క్లాసుల్లో ఇంట్లోనే చదువుకుంటున్నాడు. భర్త కాంతరాజు బయటకు వెళ్లిన తరువాత అతని భార్య రూపా ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతూ కొడుకును కూడా సక్రమంగా పట్టించుకోవడం లేదని ఆమె భర్తకు తెలిసింది. భర్త కాంతరాజ్ ఎప్పుడు ఫోన్ చేసినా అతని భార్య రూపా ఫోన్ ఎంగేజ్ రావడంతో అతనికి అనుమానం వచ్చింది.
మరిదితో అక్రమ సంబంధం?
కాంతరాజు భార్య రూపా ఆమె సొంత సోదరి భర్త (మరిది)తో చనువుగా ఉంటోందని సమాచారం. నిత్యం రూపా ఆమె ప్రియుడితోనే ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతున్నదని కాంతరాజుకు తెలిసింది. భర్త కాంతరాజు బయటకు వెళ్లిన తరువాత కొడుకును ఇంట్లో పెట్టి రూపా బయటకు వెళ్లి ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని తెలిసింది.
ఇంటికి వచ్చి వెలుతున్న మరిది
రూపా ఇంటికి సీక్రేట్ గా వస్తున్న ఆమె మరిది ఆమెతో కాలం గడిపి పని ముగించుకుని సైలెంట్ గా వెళ్లిపోతున్నాడని సమాచారం. నేను ఇంట్లో లేని సమయంలో రూపా సోదరి భర్త ఎక్కువగా ఇంటికి వచ్చి రూపాతో కాలం గడిపి వెలుతున్నాడని ఆమె భర్త కాంతరాజుకు తెలిసింది. చుట్టుపక్కల నివాసం ఉంటున్న కొందరు స్నేహితులు మీ ఇంటికి ఓ వ్యక్తి వచ్చి వెలుతున్నాడని కాంతరాజుకు చెప్పారు.
ఎదురు తిరిగిన భార్య..... చంపేసిన భర్త
ఇదే విషయంలో ఇంట్లో కాంతరాజు, రూపా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇంటికి ఎవరు వస్తే నీకెందుకు అంటూ రూపా కూడా ఆమె భర్త కాంతరాజుకు ఎదురు తిరిగింది. సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి కాంతరాజు ఇంటికి వెళ్లి అతని భార్య రూపాతో గొడవ పెట్టున్నాడు. కాంతరాజు, రూపా దంపతులు ఇంట్లో గొడవపడుతున్న విషయం స్థానికులకు వినపడింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన కాంతరాజు కత్తి తీసుకుని అతని భార్య రూపా గొంతు కోసి చంపేసి పరారైనాడు.
ధర్మస్థలం వెళ్లి ముడికట్టిన భర్త
భార్య రూపాను చంపేసిన తరువాత కేసు నుంచి తప్పించాలని ఆమె భర్త కాంతరాజు బెంగళూరు నుంచి నేరుగా పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థం వెళ్లి అక్కడ ముడికట్టి మొక్కుచెల్లించుకున్నాడు. దేవాలయంలో తలనీలాలు సమర్పించిన తరువాత మూడు పుణ్యక్షేత్రాలు సందర్శించిన కాంతరాజు అతని బంధువుల ఇంటికి వెళ్లి తల దాచుకున్నాడని సమాచారం అందడంతో బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు.
మూడుసార్లు స్కెచ్ వేసిన ఫైనాన్స్ వ్యాపారి
పుట్టింటికి వెళ్లి వస్తున్న రూపా ఆమె మరిదితో జల్సా చేస్తోందని కాంతరాజుకు కొంతకాలం ముందే తెలిసింది. రూపాను ఎలాగైనా చంపేయాలని అనేక ప్రయత్నాలు చేశాడు. కర్ణాటకలోని కరావళికి విహారయాత్రకు పిలుచుకుని వెళ్లి ఎత్తైన కొండ మీద నుంచి కిందకు తోసేసి చంపేయాలని ప్రయత్నించి విఫలం అయ్యాడు. మరోసారి ఊరికి వెళ్లి వస్తున్న సమయంలో రోడ్డు మీద కారుతో తొక్కించి చంపేయాలని ప్రయత్నించాడు.
హత్య కేసులో జైలుకు వెళ్లిన భర్త
2005లో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన ఫైనాన్స్ వ్యాపారి కాంతరాజు ఇప్పుడు అతని భార్య రూపా హత్య కేసులో మరోసారి అరెస్టు అయ్యాడు. భార్య రూపాను చంపేసిన తరువాత ఆమె మరిదిని కూడా హత్య చెయ్యాలని కాంతరాజు ప్రయత్నించాడని బెంగళూరు పోలీసులు చెప్పారు. కాంతరాజుకు నేర చరిత్ర ఉందని తెలిసినా అతని భార్య రూపా పెద్దగా పట్టించుకోలేదని, నిర్లక్షం చేసి మరిదితో చనువుగా ఉంటూ హత్యకు గురైయ్యిందని పోలీసులు అంటున్నారు.