KAS Illegal Assets: సుధా స్వర్ణసామ్రాజ్యం, ఈడీ, ఐటీ ఎంట్రీ ?, అబ్బా ఏం స్కెచ్ మేడమ్, కెవ్వుకేక!
బెంగళూరు/ మైసూరు/ ఉడిపి: కేఏఎస్ అధికారి డాక్టర్ సుధా మేడమ్ అక్రమ ఆస్తుల చిట్టా చూస్తున్న ఏసీబీ అధికారుల మైండ్ బ్లాక్ అవుతోందని తెలిసింది. సుధా స్వర్ణసామ్రాజ్యం చూసి హడలిపోయిన ఏసీబీ సీనియర్ అధికారులు సమావేశం నిర్వహించి ఈ కేసును ఈడీ, ఐటీ శాఖ అధికారులకు అప్పగించే విషయంపై చర్చించారని వెలుగు చూసింది.
ఒక్క ఉద్యోగంతో అమాయకుల జోబులు ఖాళీ చేసేసిన సుధా మేడమ్ చరిత్ర, ఆమె స్కెచ్ గురించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఆదాయపన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారని వెలుగు చూసింది. మేడమ్ మీ స్కెచ్ కెవ్వుకేక అంటున్నారు సామాన్య ప్రజలు.
Illegal affair: పైకి కోచింగ్ సెంటర్, ప్రియుడికి భార్య రొమాన్స్ పాఠాలు, నగ్న వీడియో షేర్, క్లైమాక్స్
సీనియర్ KAS ఆఫీసర్
కర్ణాటక ఐటీ, బీటీ శాఖలో డాక్టర్ సుధా సీనియర్ అధికారి. కేఏఎస్ అధికారి అయిన డాక్టర్ సుధా ప్రస్తుతం బెంగళూరులోని శాంతినగరలోని ఐటీ, బీటీ శాఖ ప్రధాన కార్యాలయంలో పరిపాలనా విభాగం సీనియర్ అధికారిగా కొన్ని నెలల నుంచి ఉద్యోగం చేస్తున్నారు. ఐటీ శాఖలో అధికారిని డాక్టర్ సుధా తీరు చూస్తుంటే ఆమె ఓ ఐటీ కంపెనీ ఎండీ లాగా కనిపిస్తారని సాటి ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు.
ఒకే ఒక్కచాన్స్ తో ఊపేసింది
2013 నుంచి కొన్ని నెలల క్రితం వరకు డాక్టర్ సుధా బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీ (BDA)ప్రధాన కార్యాలయంలో కేఏఎస్ అధికారినిగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో భూ లావాదేవీలు నిర్వహించడానికి బీడీఏ కార్యాలయానికి వచ్చి వెలుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చుకోవడానికి వచ్చి వెళ్లిన రైతులు, భూ యజమానుల నుంచి డాక్టర్ సుధా కొన్ని కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారని వెలుగు చూసింది.
ఏదైనా నాకు ఓకే.... మీరు ఓకేనా
బీడీఏలో KAS అధికారిగా పని చేసిన డాక్టర్ సుధా ఆమె అధికారం అడ్డం పెట్టుకుని ఎవరైనా వాళ్ల పని చేయించుకోవడానికి వస్తే వారి దగ్గర నగదుతో పాటు భారీ మొత్తంలో ఇంటి స్థలాలు, భూములు, అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లు, ఖరీదైన కార్లు, బంగారం, వెండి ఇలా ఏదో ఒక రూపంలో లంచాలు తీసుకున్నారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.
లోకాయుక్త కేసుతో ఏసీబీ ఎంట్రీ
ఐఏఎస్ అధికారిని డాక్టర్ సుధా అక్రమ ఆస్తులు సంపాధిస్తున్నారని ఆర్ టీఐ కార్యకర్త అబ్రహాం జూన్ 18వ తేదీ లోకాయుక్త ప్రత్యేక కోర్టులో కేసు పెట్టారు. ఇప్పటికే ఒకసారి డాక్టర్ సుధా అక్రమాస్తుల వ్యవహారంలో ఏసీబీ దాడులు జరిగాయి. డాక్టర్ సుధా వ్యవహారంపై విచారణ చెయ్యాలని లోకాయుక్త ప్రత్యేక కోర్టు ఏసీబీ అధికారులకు సూచించింది. ఆగస్టు 27వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు బెంగళూరులోని కొడిగేహళ్లిలోని డాక్టర్ సుధా ఇల్లు, సుధా బినామి రేణుకా ఇల్లు, శాంతినగరలోని ఆమె కార్యాలయం, మైసూరులోని శ్రీరాంపురలోని ఆమె భర్త ఇల్లు, ఉడిపిలోని సుధా బంధువుల ఇళ్లల్లో సోదాలు చేశారు.
సుధా మేడమ్ స్వర్ణసామ్రాజ్యం
కేఏఎస్ అధికారిని డాక్టర్ సుధా ఇంటిలో 3.5 కేజీల బంగారం, 7 కేజీల వెండి, రూ. 36 లక్షల నగదు సీజ్ చేశారు. వీటితో పాటు విలాసవంతమైన కార్లుతో పాటు కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులు సంపాధించారని ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూడటంతో ఆ పత్రాలను అధికారులు సీజ్ చేశారు. డాక్టర్ సుధాకు చెందిన సుమారు 50 బ్యాంకు అకౌంట్ లు, 200కు పైగా ఆస్తుల పత్రాలను సీజ్ చేశారు. డాక్టర్ సుధా బినామి రేణుకా అని వెలుగు చూసింది. డాక్టర్ సుధా అక్రమాస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ లో రూ. 50 కోట్లకు పైగా ఉందని అధికారులు అంచనా వేశారు.
Recommended Video
ఈడీ, ఐటీ శాఖ ఎంట్రీ?
బెంగళూరులోని కేఏఎస్ అధికారిని డాక్టర్ సుధా వ్యవహారం ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు, ఆదాయపన్ను శాఖ (IT)అధికారులకు తెలిసిందని సమాచారం. డాక్టర్ సుధా కేసును ఈడీ, ఐటీ శాఖకు అప్పగించే విషయంపై బెంగళూరులో ఏసీబీ సీనియర్ అధికారులు చర్చించారని తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈడీ, ఐటీ శాఖ అధికారులు రంగంలోకి దిగి డాక్టర్ సుధా KAS అక్రమ ఆస్తుల విషయంపై విచారణ చేసే అవకాశం ఉంది. డాక్టర్ సుధా బినామి రేణుకాను విచారణ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిసింది.