Bengaluru: పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, హోమ్ మంత్రి ఫైర్, ప్రతాప్ రెడ్డికి ఆదేశాలు, చిక్కితే!
బెంగళూరు/శివమొగ్గ: స్వాతంత్ర దినోత్సవం వజ్సోత్సవాలు భారతదేశం మొత్తం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా సోమవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు .భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్బంగా అందరూ వజ్రోత్సవాలు జరుపుకుంటుంటే కొందరు మాత్రం పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. క్లబ్ హౌస్ యాప్ లో పాకిస్తాన్ జాతీయ గీతం అప్ లోడ్ చేశారు.
భారతదేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చర్చ జరిపారు. ఇదే సందర్బంలో భారతదేశానికి వ్యతిరేకంగా చర్చ జరిపి పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వాలని తీర్మానించారని వెలుగు చూడటం కలకలం రేపింది. క్లబ్ హౌస్ విషయంలో చర్చ జరిపి పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించిన దేశద్రోహుల విషయంలో విచారణ చెయ్యాలని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కు హోమ్ శాఖా మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Illegal affair: ఆంటీ మీద అంకుల్ కు అనుమానం, ఆవేశంతో గొడ్డలితో నరికి చంపేసి!
వజ్రోత్సవాలు
స్వాతంత్ర దినోత్సవం వజ్సోత్సవాలు భారతదేశం మొత్తం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా సోమవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు .భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్బంగా అందరూ వజ్రోత్సవాలు జరుపుకున్నారు.
పాకిస్తాన్ కు మద్దతుగా క్లబ్ హౌస్ లో?
క్లబ్ హౌస్ అనే మొబైల్ యాప్ లో కొందరు పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారని వెలుగు చూసింది. క్లబ్ హౌస్ యాప్ లో పాకిస్తాన్ జాతీయ గీతం అప్ లోడ్ చేశారు. భారతదేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చర్చ జరిపారు. ఇదే సందర్బంలో భారతదేశానికి వ్యతిరేకంగా చర్చ జరిపి పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వాలని తీర్మానించారని వెలుగు చూసింది.
మొబైల్ యాప్ డీపీలో పాకిస్తాన్ జెండా
క్లబ్ హౌస్ మొబైల్ యాప్ డీపీలో పాకిస్తాన్ జెండా పెట్టిన దేశద్రోహులు పాకిస్తాన్ కు మద్దతుగా మ్యాటర్ పెట్టారు. భారతదేశానికి వ్యతిరేకంగా చర్చించిన కొందరు మనం పాకిస్తాన్ కు మద్దతు ఇద్దామని, అందుకు అందరూ సహకరించాలని చర్చ జరిపారని వెలుగు చూసింది. ఈ విషయంలో కర్ణాటక హోమ్ శాఖా మంత్రి అరగ జ్ఞానేంద్ర ఆదేశాలు జారీ చేశారు.
బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్
భారతదేశానికి వ్యతిరేకంగా చర్చ జరిపి పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వాలని తీర్మానించారని వెలుగు చూడటం కలకలం రేపింది. క్లబ్ హౌస్ విషయంలో చర్చ జరిపి పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించిన దేశద్రోహుల విషయంలో విచారణ చెయ్యాలని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డికి కర్ణాటక హోమ్ శాఖా మంత్రి అరగ జ్ఞానేంద్ర ఆదేశాలు జారీ చేశారు.
ఎవ్వరినీ వదిలిపెట్టము
శివమొగ్గలో మీడియాతో మాట్లాడిన కర్ణాటక హోమ్ శాఖా మంత్రి అరగ జ్ఞానేంద్ర క్లబ్ హౌస్ లో కొంతమంది పాకిస్తాన్ కు మద్దతుగా చర్చ జరిపారని వెలుగు చూసిందని, వారిని చట్టపరంగా శిక్షిస్తామని అన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరైన కార్యకలాపాలు సాగిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోమ్ శాఖా మంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు.