బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Rahul Gandhi: అధికారం మాదే, బీజేపీని ఇంటికి పంపిస్తాము, లీడర్స్ ధీమా, మైసూరులో రాహుల్ ఎంట్రీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మైసూరు: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో అడుగు పెట్టడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ధీమాగా చెబుతున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో 511 కిలోమీటర్లు రూట్ మ్యాప్ తో రాహుల్ గాంధీ పాదయాత్ర చెయ్యడానికి సిద్దం అయ్యారు. మైసూరు దసరా ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే ఆ జిల్లాలో శనివారం రాహుల్ గాంధీ అడుగుపెట్టారు.

Marriage: ఐదు మంది భర్తలు, ఆరో పెళ్లి చేసుకుంటున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త, క్లైమాక్స్!Marriage: ఐదు మంది భర్తలు, ఆరో పెళ్లి చేసుకుంటున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త, క్లైమాక్స్!

రాహుల్ గాంధీ ఎంట్రీ

రాహుల్ గాంధీ ఎంట్రీ

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శుక్రవారం తమిళనాడు నుంచి కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటలో కర్ణాటకలో పాదయాత్ర మొదలుపెట్టారు. గుండ్లుపేట, నంజనగూడు, మైసూరు, మండ్య జిల్లాలలోని పాండవపుర, మేలుకోటే మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగడానికి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. మాజీ సీఎం సిద్దరామయ్య రాహుల్ గాంధీ వెంట పాదయాత్ర చేస్తున్నారు.

మూడు విడతలు

మూడు విడతలు

మేలుకోటే నుంచి రంగనాథపరం నుంచి చిత్రదుర్గ జిల్లాలో రాహుల్ గాంధీ పాద్రయాత్ర కొనసాగుతుంది. 7 లోక్ సభ నియోజక వర్గాలు, 20 శాసన సభ నియోజక వర్గాల్లో మూడు విడతలుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. కర్ణాటకలో 511 కిలోమీటర్లు రూట్ మ్యాప్ తో రాహుల్ గాంధీ పాదయాత్ర చెయ్యడానికి సిద్దం అయ్యారు.

అధికారం మాదే

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో అడుగు పెట్టడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ధీమాగా చెబుతున్నారు వచ్చే శాసన సభ ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపించి ఎవరి మద్దతు లేకుండా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

బళ్లారిలో రాహుల్ గాంధీ పాదయాత్ర

బళ్లారిలో రాహుల్ గాంధీ పాదయాత్ర

రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా హీరేహాల్ లోని ఓబుళాపురం నుంచి హలకుండి, బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలవనున్నారు. బళ్లారి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ తరువాత మూడో విడతలో భాగంగా రాయచూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాయచూరు నుంచి దేవసూగూరు నుంచి వికారాబాద్ లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ తరువాత తెలంగాణలో పాదయాత్ర చెయ్యడానికి సిద్దం అయ్యారు.

English summary
Rahul Gandhi: Bharat Jodo Yatra entered to karnataka. A total of 511 kilometers of 21-day padayatra will be held in the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X