గాడిదలకు జైలు శిక్ష వేశారు, ఎందుకు?
తప్పు చేస్తే మనుషులనే కాదు, జంతువులకు కూడా జైలు శిక్ష పడుతుందని తేలిపోయిది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జలౌన్లోని ఒరాయ్ జిల్లా జైలులో 8 గాడిదలకు నాలుగు రోజుల జైలు శిక్షను విధించారు
కాన్పూర్: తప్పు చేస్తే మనుషులనే కాదు, జంతువులకు కూడా జైలు శిక్ష పడుతుందని తేలిపోయిది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జలౌన్లోని ఒరాయ్ జిల్లా జైలులో 8 గాడిదలకు నాలుగు రోజుల జైలు శిక్షను విధించారు
ఇంతకీ అవి చేసిన తప్పేమిటంటే, జైలు బయట ఉన్న మొక్కలను నాశనం చేయడమేనట. దాంట్లో ఏం ఉందని జైలు అధికారులు, పోలీసులు అనుకోలేదు. అందుకే వెంటనే గాడిదలను పట్టుకొని 4 రోజుల శిక్ష విధించాకు. 4 రోజుల శిక్ష పూర్తయిన తర్వాత వాటిని జైలు నుంచి బయటికి వదిలేశారట.
సోమవారంనాడు గాడిదలు జైలు నుంచి విముక్తి పొందాయి. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా జైలు ఆవరణలో నాటిన మొక్కలను ధ్వంసం చేసినందుకు అవి జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఆ గాడిదలు స్థానికుడైన కమలేష్ అనే వ్యక్తి సంబంధించనవి.
జైలు సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు ఎనిమిది గాడిదలను పోలీసులు చుట్టుముట్టి వాటిని అరెస్టు చేసి జైల్లో బంధించారు. ఈ నెల 24వ తేదీన అవి 60 వేల రూపాయల విలువ చేసే మొక్కలను నాశనం చేసినట్లు తెలుస్తోంది.