షాక్: కాలేజీ విద్యార్థినిపై వీర్యం నింపిన బెలూన్ విసిరారు
న్యూఢిల్లీ: శ్రీరామ్ మహిళా కాలేజీకి చెందిన ఓ విద్యార్థినికి విచిత్రమైన, జుగుప్సాకరమైన అనుభవం ఎదురైంది. హోలీకి చాలా రోజులు ముందు నుంచే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్కులు తమపైకి నీటితో నింపిన బెలూన్లు విసిరారని చాలా మంది విద్యార్థులు గతంలో ఫిర్యాదు చేశారు.
ఈసారి వీర్యంతో నింపిన బెలూన్లు వదులుతున్నారని ఈసారి విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ విషయంపై ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో రాయడంతో అది వెలుగులోకి వచ్చింది. ఆదివారంనాడు తనపై వీర్యంతో నింపిన బెలూన్తో దాడి చేశారని ఆ విద్యార్థిని రాసింది.
షాక్కు గురైన విద్యార్థిని
బెలూన్ వల్ల తన దుస్తులన్నీ పాడయ్యాయని ఆ విద్యార్థిని చెప్పింది. ఈ విషయాన్ని తన మిత్రురాలితో పంచుకుంది. ఆ ప్రాంతంలో ఇది సాధారణమని ఆమె చెప్పంది. ఈ సంఘటనపై కాజేలీ మహిళా అభివృద్ధి విభాగం మంగళవారం సమావేశమై చర్చించింది. మార్చి 8వ తేదీ నుంచి ఆత్మరక్షణ కోసం వర్క్షాపు నిర్వహిస్తామని పోలీసులు చెప్పారు.
మాకు ఫిర్యాదు అందలేదు...
ఆ
సంఘటనపై
తమకు
ఏ
విధమైన
ఫిర్యాదు
అందలేదని,
అయితే
దానిపై
విచారణ
జరుపుతున్నామని,
ఆ
ప్రాంతంలోని
సిసిటీవీ
ఫుటేజీలను
పరిశీలిస్తున్నామని
ిసిపి
చిన్మయ్
బస్వాల్
చెప్పినట్లు
జాతీయ
మీడియా
రాసింది.
ఏడాది అంతా జరుగుతూనే ఉంటాయి....
అటువంటి సంఘటనలు ఏడాది అంతా జరుగుతుంటాయని, హోలీ సమయంలో మాత్రం పెద్ద యెత్తున జరుగుతుంటాయని సెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటనలపై విద్యార్థులు నిస్పృహ, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.
ఫిర్యాదు చేయాలని చెబుతాం...
కాలేజీ పరిసరాల్లో సురక్షితమైన వాతావరణం కోసం పోరాటం చేయడం అవసరమని సెల్ గుర్తించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదు చేయాల్సిందిగా విద్యార్థులను కోరినట్లు కళాశాల విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ అమితా యాదవ్ చెప్పారు.