స్వదేశాన్ని వీడుతున్న ‘శ్రీమంతులు’.. స్థిర నివాసానికే సుమా!
న్యూఢిల్లీ:
దేశీయంగా
ఉన్నత
విద్యాభ్యాసం
చేసిన
వారు
ఆ
పై
చదువుల
కోసం
అమెరికా,
బ్రిటన్,
ఆస్ట్రేలియా
వెళ్లి
చదువుకుని
ఉద్యోగాలు
చేస్తూ
అక్కడే
సెటిల్
అవుతున్నవారు
ఉన్నారు.
కానీ
ఇదే
నిజం
కాదు.
సంపన్నులు..
కోట్ల
కొద్దీ
నగదు
సంపాదించిన
మిలియనీర్లు..
విదేశాల
పడుతున్నారు.
వ్యాపారం
కోసం
మాత్రం
కాదు.
కుటుంబసమేతంగా
పర్యాటక
యాత్ర
అంతకన్నా
కాదు.
మరెందుకు
అనుకుంటున్నారా?
ఆయా
దేశాల్లోనే
స్థిర
నివాసం
ఏర్పరుచుకోవడానికి.
అవును..
నమ్మినా
నమ్మకున్నా
ఇది
నిజం.
పరాయి
దేశానికి
భారతీయ
సంపన్నులు
వలసపోతున్నారు.
ఆందోళనకర
విషయమేమిటంటే..
ఇలా
వెళ్లిపోతున్నవారి
సంఖ్య
ఏటేటా
పెరుగుతుండటం.
అంతకు
ముందు
ఏడాదితో
పోల్చుకుంటే
భారత్
నుంచి
విదేశాలకు
వలసలుగా
వెళ్లిపోయిన
మిలియనీర్ల
సంఖ్య
16
శాతం
పెరిగింది.
గతేడాది
7,000
మంది
భారతీయ
ధనవంతులు
విదేశాలకు
వెళ్లిపోగా,
అంతకుముందు
ఏడాది
ఈ
సంఖ్య
6,000గా
ఉన్నది.
2015లో
4,000
మందిగా
ఉంటే,
రెండేండ్లలో
3,000
మంది
పెరుగడం
గమనార్హం.
నిరుడు
విదేశాలకు
వలసపోయిన
సంపన్నుల
జాబితాలో
భారత్
రెండో
స్థానంలో
నిలిచింది.
10,000
మందితో
చైనా
మొదటి
స్థానంలో
ఉన్నట్లు
న్యూ
వరల్డ్
వెల్త్
తాజా
నివేదిక
స్పష్టం
చేసింది.
సంపన్నులు
వలస
వెళ్లినా
నో
ప్రాబ్లం
ఈ
జాబితాలో
టర్కీ
(6,000)
మూడో
స్థానంలో
ఉండగా,
ఆ
తర్వాత
బ్రిటన్
(4,000),
ఫ్రాన్స్
(4,000),
రష్యా
(3,000)
దేశాలు
ఉన్నాయి.
ఇకపోతే
భారతీయ
మిలియనీర్లు
అత్యధికంగా
అగ్రరాజ్యం
అమెరికాకే
వలస
వెళ్తున్నారు.
ఆ
తర్వాత
యునైటెడ్
అరబ్
ఎమిరేట్స్
(యూఏఈ),
కెనడా,
ఆస్ట్రేలియా,
న్యూజిలాండ్
దేశాల్లో
స్థిరపడుతున్నారు.
చైనా
కుబేరులు
సైతం
అమెరికా
ఎంచుకుంటుండగా,
కెనడా,
ఆస్ట్రేలియా
దేశాలకు
ఆ
తర్వాతీ
ప్రాధాన్యం
ఇస్తున్నారు.
అయినా
భయపడనక్కర్లేదంటున్నది
న్యూ
వరల్డ్
వెల్త్.
భారత్,
చైనాల
నుంచి
వెళ్లిపోతున్న
మిలియనీర్ల
కంటే
కొత్తగా
ఈ
దేశాల్లో
పుట్టుకొస్తున్న
మిలియనీర్ల
సంఖ్యే
ఎక్కువగా
ఉంటున్నదని,
కాబట్టి
ఇప్పటికిప్పుడు
ఈ
రెండు
దేశాలకు
మిలియనీర్ల
వలసలతో
వచ్చిన
ముప్పేమీ
లేదన్న
అభిప్రాయ
పడుతున్నది.
జీవన
ప్రమాణాలు
మెరుగు
పడితే
మళ్లీ
వెనక్కి..
స్వదేశాల్లో
జీవన
ప్రమాణాలు
మెరుగుపడితే
దూరమైన
సంపన్నులు
తిరిగి
వస్తారన్న
విశ్వాసం
వెలిబుచ్చింది.
ఇదిలావుంటే
వివిధ
దేశాల
నుంచి
ఆస్ట్రేలియాకు
అత్యధికంగా
మిలియనీర్లు
వలస
పోతున్నారు.
గతేడాది
10,000
మంది
సంపన్నులు
ఆయా
దేశాల
నుంచి
ఇక్కడకు
వచ్చి
స్థిరపడినట్లు
తేలింది.
అంతకుముందు
అమెరికాకే
ఎక్కువగా
వలసలుండేవి.
అయితే
2015
నుంచి
ఈ
పరిస్థితి
మారింది.
10
ఏళ్లలో
83
శాతం
పెరిగిన
ఆస్ట్రేలియా
సంపద
కాగా,
గడిచిన
పదేళ్లకుపైగా
కాలంలో
ఆస్ట్రేలియాలోని
మొత్తం
సంపద
83
శాతం
ఎగబాకింది.
ఇదే
సమయంలో
అమెరికా
సంపద
20
శాతమే
పెరిగినట్లు
కనిపిస్తున్నది.
ఫలితంగా
సగటు
అమెరికా
పౌరుడి
కంటే
ఇప్పుడు
ఆస్ట్రేలియా
పౌరుడే
సంపన్నుడు.
పదేళ్లకు
ముందు
ఇటువంటి
పరిస్థితి
లేదని
తాజా
అధ్యయనంలో
తేలింది.
ఇక
2017లో
అమెరికాకు
9,000
మంది
మిలియనీర్లు
విదేశాల
నుంచి
రాగా,
ఆ
తర్వాత
ఎక్కువగా
కెనడా
(5,000),
యూఏఈ
(5,000)
దేశాలకు
వెళ్లినట్లు
రుజువైంది.
కాగా,
ప్రపంచవ్యాప్తంగా
స్వదేశాలను
వీడి
విదేశాలకు
వలసపోయిన
మిలియనీర్ల
సంఖ్య
గతేడాది
దాదాపు
95,000గా
నమోదైంది.
2016లో
82,000గా,
2015లో
64,000గా
ఉందని
ఈ
నివేదికలో
న్యూ
వరల్డ్
వెల్త్
తెలియజేసింది.
బిలియనీర్లలో
భారత్కు
మూడో
స్థానం
అమెరికా,
చైనా
తర్వాత
అత్యధిక
బిలియనీర్లు
ఉన్నది
భారత్లోనే
మరి.
రూ.6,500
కోట్లు
అంతకంటే
ఎక్కువ
కలిగిన
బిలియనీర్లు
భారత్లో
119
మంది
ఉంటారు.
దీని
ప్రకారం
బిలియనీర్ల
జాబితాలో
భారత్
మూడో
స్థానంలో
ఉన్నది.
ఇక
సంపన్న
దేశాల్లో
రూ.5,34,95,000
కోట్లతో
భారత్కు
6వ
స్థానం
లభించింది.
భారత్లో
రూ.6.5
కోట్లు
అంతకంటే
ఎక్కువ
నికర
ఆస్తులు
ఉన్న
మిలియనీర్లు
3,30,400
మంది
ఉంటారు.
ఈ
విషయంలో
భారత్కు
ప్రపంచ
దేశాల్లో
9వ
స్థానం
దక్కింది.
భారత్లో
రూ.13
కోట్లు
అంతకంటే
ఎక్కువ
సంపద
కలిగిన
మల్టీ
మిలియనీర్లు
20,730
మంది
ఉండగా..
ఈ
క్యాటగిరీలో
భారత్
ప్రపంచంలోనే
7వ
అతిపెద్ద
దేశంగా
నిలుస్తోంది.