భారత మార్కెట్లో యాపిల్ రిటైల్ మార్కెట్లు
న్యూఢిల్లీ: భారత మార్కెట్ పైన యాపిల్ కంపెనీ దృష్టి సారించింది. దేశంలో రిటైల్ సహా ఇతర కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్, ఇక్కడ అపార అవకాశాలున్నాయని తెలిపారు.
భారత్ మార్కెట్లో చాలా తక్కువ వాటా ఉందని, దీనిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ ఫోన్ అమ్మకాల పరంగా ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉందన్నారు. కానీ తమ వాటా తక్కువగా ఉందన్నారు.
అధిగ వేగం డేటా బదలీ నెట్ వర్క్లపై పెట్టుబడులు పెడుతున్న సంస్థలతో కలిసి ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఏడాదిలో తొలి అర్థ భాగం అమ్మకాల పరంగా భారత్లో రికార్డ్ సృష్టిస్తామన్నారు.
గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల ఫీచర్ ఫోన్లు అమ్ముడయ్యాయని, క్రమంగా వీరు స్మార్ట్ ఫోన్లకు మారుతారని టిమ్ కుక్ తెలిపారు. అందువల్ల స్మార్ట్ ఫోన్, ఐపోన్ అమ్మకాలకు భారీ అవకాశాలున్నాయని చెప్పారు.