కోరుకొన్న సీట్లకు అధిక మొత్తం చెల్లించాల్సిందే: ఎయిరిండియా
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ఒకే దగ్గర కూర్చొని ప్రయాణం చేయాలంటే ఇక నుండి ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందే. ముందు వరుస సీట్లకు విధిస్తున్నట్టుగానే విండో , మధ్య సీట్లకు, ఎక్కువ వరుస సీట్లకు అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేయాలని ఎయిరిండియా నిర్ణయం తీసుకొంది.
పలు రూట్లలో సీటు సెలక్షన్ ఫీజును లిస్ట్ చేస్తూ ట్రావెల్ ఏజంట్లకు ఓ సర్క్యూలర్ను జారీ చేసింది. దేశీయ విమానాల్లో మధ్య సీట్లకు రూ.100 చార్జీని విధించను్నారు. విండో సీటును కోరుకొంటే రూ. 200 ఛార్జీ విధించనున్నారు.
ఖాట్మాండ్ ప్రయాణాలకు విండో సీట్లకు రూ.100 చార్జీగా విధించనున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వరుసకు ఈ ఫీజును మరింత ఎక్కువగా వసూలు చేయాలని ఎయిరిండియా నిర్ణయం తీసుకొంది.
సీట్ల ఎంపికకు అదనపు ఛార్జీలు వసూలు చేయడాన్ని కుటుంబ ఫీజుగా ఎయిరిండియా పరిగణిస్తోంది ఈ ఛార్జీలు ఎయిర్లైన్స్ రెవెన్యూలు పెంచడానికి దోహదం చేయనున్నాయి
తమకు ఇష్టమైన సీట్లను ఎంపిక చేసుకోవడంతో పాటు ఛార్జీల చెల్లింపును ఆన్లైన్ టిక్కెట్టు బుక్ చేసుకొనే సమయంలో లేదా వెబ్ చెక్ ఇన్ లో చెల్లించాల్సి ఉంటుందని ఎయిరిండియా వర్గాలు చెబుతున్నాయి.