పెట్రోల్, డీజీల్పై సేల్స్ ట్యాక్స్, వ్యాట్ తగ్గించాలి: ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్పై విధిస్తున్న సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ను తగ్గించాలంటూ కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్, డీజీల్ ద్వారా ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ఉండే ఉద్దేశ్యంతో కేంద్రం ఈ మేరకు రాష్ట్రాలను గురువారం నాడు ఆదేశించింది.
Recommended Video
. పలు రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించాయి. ఎక్కువ మొత్తంలో వ్యాట్ను కలిగి ఉన్న రాష్ట్రాలు, వినియోగదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని పన్ను రేట్లను తగ్గించాలని మంత్రి కోరారు.. అంతేకాక పెట్రోలియం రంగాన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ పరిధిలోకి తీసుకురానున్నట్టు కూడా తెలిపారు.
అంతర్జాతీయ ధరల ప్రభావంతో ఇటీవల విపరీతంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ పెంపుదలను నియంత్రణలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది.
లీటరు పెట్రోల్కు 21.48గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.19.48కు తీసుకొచ్చింది. అదేవిధంగా డీజిల్పై రూ.17.33గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.15.33కు కుదించింది.