2018లో బడ్జెట్: చమురు సంస్థలతో ప్రభుత్వ బంధానికి తెగదెంపులే!
న్యూఢిల్లీ: అసలే ఇది ఎన్నికల ఏడాది. మరో నాలుగు నెలల్లో నాలుగు, ఈ ఏడాది చివరిలో మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు అటుపై లోక్సభ ఎన్నికలకు వెళ్లాల్సిన తరుణం వచ్చేసింది. కానీ ఎన్నికల వేళ ప్రజాకర్షక విధానాలు అమలు చేయాల్సిన తప్పనిసరి బాధ్యత ప్రభుత్వానిది. అందునా గతేడాది జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి బడ్జెట్ ఇది. 2017 - 18లో ద్రవ్యలోటు 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జీఎస్టీ అమలుతో వివిధ వర్గాలు, రంగాల నుంచి వచ్చే రెవెన్యూ వసూళ్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో తగ్గే ఆదాయ లోటును పూడ్చేసేందుకు ప్రభుత్వానికి పెట్టుబడుల ఉపసంహరణ ఒక తారక మంత్రంగా, కల్పతరువుగా, కామధేనువుగా మారనున్నది. కాగా ఈ ఏడాది రూ.91,252.6 కోట్ల మేరకు ఆదాయం పొందాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రారంభంలోనే బిగ్ టికెట్ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
హెచ్పీసీఎల్లో
రూ.36,915
కోట్ల
ఉపసంహరణకు
ఇలా
ప్లాన్
హెచ్పీసీఎల్లో
రూ.36,915
కోట్ల
పెట్టుబడులు
ఉపసంహరించాలని
సంకల్పించారు.
తాజాగా
సవరించిన
అంచనాల
ప్రకారం
హెచ్పీసీఎల్లో
ప్రభుత్వ
51
శాతం
వాటా
రూ.36,915
కోట్ల
పెట్టుబడులను
ఓఎన్జీసీ
స్వాధీనం
చేసుకోనున్నట్లు
తెలిపింది.
అప్పుల
రూపేణా
రూ.20
వేల
కోట్ల
ఆదాయం
సమకూర్చుకోనున్నట్లు
ప్రకటించింది.
ప్రస్తుత
ఆర్థిక
సంవత్సరంలో
రూ.72,500
కోట్ల
పెట్టుబడులు
ఉపసంహరించడం
లక్ష్యంగా
పెట్టుకుంటే
రూ.54,337.60
కోట్ల
మేరకు
కేంద్రం
ఆదాయం
పొందింది.
గతేడాది
హడ్కో
తదితర
సంస్థల్లో
రూ.54,337
కోట్లు
ఉపసంహరణ
సీపీఎస్ఈల్లో
పెట్టుబడుల
ఉపసంహరణ
ద్వారా
రూ.46,500
కోట్లు,
లిస్టెడ్
బీమా
సంస్థల్లో
వ్యూహాత్మకంగా
పెట్టుబడుల
ఉపసంహరణ
ద్వారా
రూ.11
వేల
కోట్ల
ఆదాయం
పొందింది.
దీనివల్ల
హడ్కో,
ఈఐఎల్,
ఎన్టీపీసీ,
నాల్కో,
ఆయిల్,
జీఐఎసీ,
న్యూ
ఇండియా
ఇన్సూరెస్స్
సంస్థల్లో
ప్రభుత్వ
వాటా
తగ్గుముఖం
పట్టింది.
2016
-
17
ఆర్థిక
సంవత్సరంలో
రూ.56,500
కోట్ల
పెట్టుబడుల
ఉపసంహరణ
లక్ష్యం
నిర్దేశించుకున్న
ప్రభుత్వం
రూ.46,247
కోట్ల
పెట్టుబడులు
ఉపసంహరించుకున్నది.