పన్ను రిటర్న్లు దాఖలు చేయని వారిపై ఆదాయపన్ను శాఖ దృష్టి
న్యూఢిల్లీ: 2017 - 18 సంవత్సరంలో కొత్తగా రూ.1.5 లక్షల కోట్లు అదనపు పన్నులు రానున్నాయి. అంతేకాదు, రికార్డ్ సంఖ్యలో కొత్త వారు రిటర్స్ ఫైల్ చేశారు. గత రెండేళ్లలో కొత్తగా ట్యాక్స్ ఫైల్ చేసే వారి సంఖ్య 62 శాతం పెరిగింది.
పన్ను చెల్లించే ఆదాయం ఉండి కూడా రిటర్నులు చేయని వారిపై ఆదాయపన్ను శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పన్ను చెల్లించే వారి సంఖ్యను పెంచాలన్న లక్ష్యాన్ని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ విషయమై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
రిటర్నాలు దాఖలు చేయని 65 లక్షల మందిపై ప్రత్యేక దృష్టి సారించింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవడం ద్వారా పన్ను చెల్లించే వారి సంఖ్యను 9.3 కోట్లకు ఆదాయపన్ను శాఖ చూస్తోంది.
1.75 కోట్ల మంది ఆదాయపన్ను నిబంధనలను పాటించకపోవడంతో వారిని ఈ మెయిల్స్, ఎస్సెమ్మెస్ల ద్వారా సంప్రదించాలని నిర్ణయించింది. ఇందులో 1.07 కోట్ల మంది స్వచ్చంధంగా రిటర్నులు దాఖలు చేసారు. మిగిలిన వారి మిన్నకుండిపోయారు. దీంతో వారిని సంప్రదించనుంది.