వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్కెట్ సరికొత్త రికార్డులు: సెన్సెక్స్ 37,000, నిఫ్టీ 11,250

|
Google Oneindia TeluguNews

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. బాంబే స్టాక్ ఎక్ఛేంజ్(బీఎస్ఈ) సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా 37వేల మార్క్ పైన స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్ఛేంజ్(నిఫ్టీ) కూడా 11,200పైన ముగిసింది.

అంచనాలను మించి కంపెనీల త్రైమాసిక ఫలితాలు నమోదవడం, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు పెరగడం, రూపాయి బలపడటం.. దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌కు కలిసొచ్చాయి. దీంతో లోహా, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

Historic highs: Sensex closes above 37,000, Nifty tops 11,250

ఈ పరిణామాలతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు జోరుగా సాగాయి. శుక్రవారం ఉదయం నుంచి కూడా రికార్డు స్థాయిలో మార్కెట్లు పరుగులు పెట్టడం గమనార్హం. ఉదయం 200 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్.. ఆద్యంతం ఆ జోరు కొనసాగింది. కొనుగోళ్ల మద్దతుతో 300పాయింట్లకు పైగా ఎగబాకింది.

చివరకు 352పాయింట్లు లాభపడి 37,337 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 111పాయింట్లు లాభపడి 11,278వద్ద స్థిరపడింది. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.68.71గా కొనసాగుతోంది.

English summary
India's benchmark indices breached record levels, with the Sensex hitting the 37,000 points mark for the first time on the back of gains in heavyweights like HDFC Bank and Larsen and Toubro.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X