ఎస్బీఐ చైర్మన్ ప్రశ్నలకు బదులేది?: ప్రైవేటీకరణ సరే.. సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తారా?
హైదరాబాద్:
పంజాబ్
నేషనల్
బ్యాంక్
(పీఎన్బీ)లో
నీరవ్
మోదీ
నయా
మోసం
సాకుగా
ప్రభుత్వ
రంగ
బ్యాంకుల
ప్రైవేటీకరణ
నినాదం
ఒకింత
ఊపందుకున్నది.
అదీ
కూడా
కార్పొరేట్
సంస్థలకు
ప్రాతినిధ్యం
వహిస్తున్న
పారిశ్రామిక
యాజమాన్య
సంస్థలు
ఫెడరేషన్
ఆఫ్
ఇండియన్
చాంబర్స్
ఆఫ్
కామర్స్
అండ్
ఇండస్ట్రీ
(ఫిక్కీ),
అసోసియేటెడ్
చాంబర్స్
ఆఫ్
కామర్స్
అండ్
ఇండస్ట్రీ
ఆఫ్
ఇండియా
(అసోచామ్),
కాన్ఫిడరేషన్
ఆఫ్
ఇండియన్
ఇండస్ట్రీ
(సీఐఐ)
ప్రతినిధుల
నుంచే
ఎక్కువగా
వినిపించింది.
చివరకు
కొటక్
మహీంద్రా
బ్యాంక్
వైస్
చైర్మన్
ఉదయ్
కొటక్
మరో
అడుగు
ముందుకేసి
ప్రభుత్వ
రంగ
బ్యాంకుల
అవసరమే
లేదని
వాదించేందుకు
కూడా
వెనుకంజ
వేయలేదు.
దీనిపై
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
(ఎస్బీఐ)
చైర్మన్
రజనీస్
కుమార్
తీవ్రంగా
స్పందించడంలో
ఆశ్చర్యమేమీ
లేదు.
అంతేకాదు
అందులో
హేతుబద్ధత
కూడా
ఉంది.
మారుమూల గ్రామాల్లో ప్రైవేట్ బ్యాంకులు సేవలందిస్తాయా?
‘అద్దాల మేడల్లో ఉండేవారు అవతలి వారిపై రాళ్లు విసరొద్దు' అని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయాలని డిమాండ్ చేస్తున్న విమర్శకులపై ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సంస్థల్లోనే అత్యున్నత పరిపాలనా ప్రమాణాలు పాటిస్తున్నారని గుర్తు చేశారు. మారుమూల గ్రామాల్లో, అట్టడుగు వర్గాల వారికి ప్రైవేట్ బ్యాంకులు సేవలు అందించగలవా? అని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కష్టనష్టాలను భరిస్తూ సేవలందిస్తున్న సంగతి విస్మరించారా? అని నిలదీశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సామాజిక ఆర్థిక బాధత్యలు, ఎజెండా అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు.
నీరవ్ మోదీ సాకుగా బ్యాంకుల ప్రైవేటీకరణ నినాదం సరి కాదు
ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అత్యున్నత ప్రమాణాలు అమలు అవుతున్నాయని కుండబద్ధలు కొట్టారు. వజ్రాల వ్యాపారి, విలాస పురుషుడు నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11,400 కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పీఎన్బీలో నయా మోసం సాక్షిగా బ్యాంకులను ప్రైవేటీకరించాలని డిమాండ్ చేయడం సరి కాదని స్పష్టం చేశారు.
తక్కువ ప్రమాణాలు ఉన్నదీ ప్రైవేట్ సంస్థల్లోనే
ఇప్పుడు ఉన్న మొండి బకాయిలు, తక్కువ స్థాయి ప్రమాణాలు ఉన్న కేసులు దాదాపు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రైవేట్ రంగంలోని సంస్థల్లో కార్పొరేట్ పరిపాలనా విధానాలు చాలా బాగుంటే ప్రభుత్వ రంగంలోని ఏ సంస్థ ఇప్పుడు ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) వద్ద ఉందో చెప్పాలి' అని రజనీశ్ అన్నారు. ప్రస్తుతం లా ట్రైబ్యునల్ వద్ద ఉన్న కంపెనీలన్నీ ప్రైవేట్ సంస్థలే కదా అని ఉదహరించారు.
బ్యాంకర్లకు బకాయిదారుల హితబోధలా?
‘రుణ ఎగవేతదారులంతా వారి పరిశ్రమసంఘాల్లో ముందు వరుసలో కూర్చుకుంటారు. అందరికీ హితబోధలు చేస్తారు. ఈ కాలంలో జరుగుతున్నదంతా ఇదే కదా' అని రజనీశ్ పేర్కొన్నారు. ఎగవేతదారులంతా ముందు వరుసలో బ్యాంకర్లంతా వెనక వరుసలో ఎందుకు కూర్చోవాలని ఆయన ప్రశ్నించారు.
సమాజ మెరుగుదలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రుషి ఇతోధికం
నీరవ్ మోదీ నయా మోసం నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనా విధానాలు పటిష్ఠంగా లేవని, ప్రమాణాలు ఘోరంగా ఉన్నాయని, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా అవసరం లేదని కొటక్ మహింద్రా బ్యాంకు ఎక్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఉదయ్ కొటక్ విమర్శించారు. మరికొందరు వ్యాపార వేత్తలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులపై విమర్శలు చేస్తున్న వారిపై ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ ప్రతి విమర్శలు చేశారు. సమాజం మెరుగుపడేందుకు అవి కచ్చితమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
జాతి నిర్మాణంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు
‘పట్టణాలకు దూరంగా, పల్లెల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో శాఖలను నడుపుతున్న ప్రైవేట్ సంస్థలు ఏమైనా ఉన్నాయా' అని పీఎన్బీ చైర్మన్ రజనీశ్ కుమార్ ప్రశ్నించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ప్రజలు, బ్యాంకింగ్ వ్యవస్థ నమ్మకం పోగొట్టే పని చేస్తుందని తాను భావించడం లేదని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు జాతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యాయన్న విషయంలో ఎటువంటి వివాదమూ లేదని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ గుర్తు చేశారు. గ్రామాల్లో శాఖల సేవల విస్తరణకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకెళుతూ ఉంటే ప్రైవేట్ రంగం వెనుకాముందు ఆలోచిస్తున్నదని చెప్పారు.
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ మినహా బ్యాంకుల కన్సాలిడేషన్
1969లో తప్పనిసరి పరిస్థితిలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయకరణ చేయడం వల్లే ప్రభుత్వ రంగ బ్యాంకులు గ్రామీణులకు సేవలందిస్తున్నాయని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజాకర్షక విధానాలు అర్హుల దరికి చేర్చడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. దీనికి అదనంగా భారీస్థాయిలో పంట రుణ మాఫీ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వైఖరికి అనుకూలంగానే కేంద్ర ఆర్తిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పరిస్థితి మెరుగుదలకే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఐడీబీఐ బ్యాంక్ మినహా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు అవకాశం లేదని చెప్పారు. కొన్ని బ్యాంకులను కన్సాలిడేట్ చేస్తున్నామని తెలిపారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటాను 49 శాతానికి తగ్గించుకోవాలని యోచిస్తున్నామని తెలిపారు.