వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోసం గుర్తించినా.. స్పందించలేదు: యూనియన్ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. యూనియన్ బ్యాంక్‌లో జరిగిన మోసాన్ని సరైన సమయంలో గుర్తించి, నివేదిక పంపనందుకు గానూ రూ.కోటి జరిమానా వేసింది. ఈ మేరకు రెగ్యూలేటరీ ఫైలింగ్ సందర్భంగా యూనియన్ బ్యాంక్ వెల్లడించింది.

బ్యాంకులో జరిగిన మోసాన్ని గుర్తించి, నివేదిక పంపడంలో ఆలస్యం అయినందుకు గానూ రిజర్వ్ బ్యాంక్ రూ. కోటి జరిమానా విధించినట్లు తెలిపింది. బ్యాంకుల నియంత్రణ చట్టం కింద ఆర్బీఐకి ఉన్న విశేషాధికారాలతో ఈ జరిమానా వేసిందని యూనియన్ బ్యాంక్ తెలిపింది.

RBI imposes Rs 1 crore fine on Union Bank for delay in fraud detection, reporting

యూనియన్ బ్యాంక్‌కు ఎందుకు జరిమానా వేయకూడదో చెప్పాలంటూ ఈ ఏడాది జనవరిలో రిజర్వ్ బ్యాంక్ షోకాజు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు బ్యాంక్ స్పందించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ ముందు విచారణ కూడా ఇచ్చింది.

అయితే, బ్యాంక్ సమాధానం అసంపూర్ణంగా ఉందని చెబుతూ రూ.కోటి జరిమానా విధించిందని యూనియన్ బ్యాంక్ తెలిపింది. కాగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని యూనియన్ బ్యాంక్ పేర్కొంది.

English summary
RBI imposes Rs 1 crore fine on Union Bank for delay in fraud detection, reporting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X