ఎన్నడూలేని విధంగా రూ. 71కి చేరిన రూపాయి మారకం: కారణాలివే
ముంబై: రూపాయి మారకం విలువ గతంలో ఎన్నడూ లేనివిధంగా క్షీణించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోయి తొలిసారిగా రూ.71కి చేరింది. అమెరికా డాలరుకు పెరుగుతున్న డిమాండ్తో పాటు ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ 26 పైసలు పడిపోయింది.
రూపాయి గురువారం సెషన్లో రూ.70.74 వద్ద ముగిసింది. శుక్రవారం ఫారెక్స్ ట్రేడింగ్ ఆరంభంలో రూ.70.95పైసల వద్ద ప్రారంభమైంది. తర్వాత మరింతగా క్షీణించి రూ.71 వద్ద తాజా జీవన కాల క్షీణత నమోదు చేసింది.
చమురు దిగుమతిదారుల నుంచి డాలరుకు గిరాకీ పెరగడం, చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు వెంటాడం రూపాయి క్షీణతకు దారితీస్తోంది.
కాగా, చైనా-అమెరికాల మధ్య వాణిజ్య భయాలు కూడా దేశీయ కరెన్సీలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.94 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మారకం విలువ మార్కెట్లను ఒడిదుడులకు గురిచేసే అవకాశం ఉంది.