వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్‌ 2018 : భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: బడ్జెట్ ప్రసంగం మొదలైంది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రసంగానికి శ్రీకారం చుట్టడానికి ముందే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ ర్యాలీ కొనసాగిస్తున్నాయి.

గురువారం ఉదయం ప్రారంభంలోనే 100 పాయింట్లకు ఎగిసిన సెన్సెక్స్‌ 36 వేల మార్కును తిరిగి చేధించింది. ప్రస్తుతం 230 పాయింట్ల లాభంలో 36,195 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 61 పాయింట్ల లాభంలో 11,088 వద్ద లాభాలు పండిస్తోంది.

Sensex, Nifty trade higher on budget day

మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ కావడంతో మదుపరుల కళ్లన్నీ బడ్జెట్‌ పైనే ఉన్నాయి.
అయితే గ్లోబల్‌ మార్కెట్ల ప్రభావం, బడ్జెట్‌కు ముందు ఇన్వెస్టర్లందరూ అప్రమత్తంగా వ్యవహరించడంతో స్టాక్‌ మార్కెట్ సూచీలు గత రెండు రోజులుగా నష్టాలతో ముగిశాయి.

అయితే బడ్జెట్‌ ప్రారంభం కావడానికి కాస్త ముందుగా మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమవ్వడం సానుకూల అంశంగా కనిపిస్తోంది. అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించగానే, భారీగా హెచ్చు తగ్గులకు గురయ్యే అవకాశం ఉందని మరోవైపు స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు కూడా హెచ్చరించారు.

English summary
Benchmark indices rose on Thursday just ahead of the Narendra Modi-led government’s last full federal budget before a general election next year, amid hopes it would stay the course on containing the fiscal deficit. BSE sensex again crossed 36,000 mark on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X