Super wife: క్యాషియర్ భర్త, నా భార్యను చూస్తే మూడ్ రాదు, మెరుపుతీగ అమ్మాయిలు, కంతిరీగ ఆంటీలతో జల్సా!
చెన్నై/ మదురై/ తిరుచ్చి: ప్రముఖ బ్యాంకులో క్యాషియర్ గా పని చేస్తున్న కేటుగాడికి సూపర్ ఫిగర్ తో పెళ్లి అయ్యింది. ఫస్ట్ నైట్ నుంచి భార్యతో కాపురం చెయ్యకుండా ఆమెను పస్తులు పెట్టిన క్యాషియర్ స్మార్ట్ ఫోన్లలో బూతు బొమ్మలు చూసుకుంటూ కాలం గడిపేశాడు. ఎన్నిరోజులైనా భర్త తనతో ఎందుకు సంసారం చెయ్యడం లేదు ? అంటూ భార్యకు అనుమానం వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు భర్త ఉపయోగిస్తున్న 12 మొబైల్ ఫోన్లు, మూడు ల్యాప్ టాప్ ల్లో 400 మందికి పైగా మెరుపు తీగలాంటి అమ్మాయిలు, కండలు తిరిగిన కంతిరీగ లాంటి ఆంటీల నగ్న వీడియోలు, వారితో తన భర్త రాసలీలల వీడియోలు చూసిన భార్య షాక్ అయ్యింది.
పరాయి స్త్రీలతో ఎంజాయ్ చేస్తూ తనను మోసం చేస్తున్న భర్త భాగోతాన్ని భార్య బయటపెట్టడంతో దెబ్బకు అరెస్టు అయిన భర్త జైలకు పోయాడు. 2020లో తమిళనాడులో ఈ ఘటన బ్యాంకు ఉద్యోగులు, ఆ బ్యాంకులో ఖతాలు ఉన్నవారిని కలవరానికి గురి చేసింది.
బ్యాంకు క్యాషియర్ కేటుగాడి పెళ్లి
తమిళనాడులోని తిరుచ్చిలోని మనప్పరై మస్తాన్ వీధికి చెందిన ఎడ్విన్ జయకుమార్ ఇండియన్ బ్యాంకులో క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చూడటానికి అమాయకుడలాగా ఉంటున్న ఎడ్విన్ జయకుమార్ కేటుగాడు అనే విషయం తెలీకపోవడంతో తంజావూర్ కు చెందిన ఓ ఫ్యామిలీ అతనికి వారి కుమార్తెను ఇచ్చి పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యారు. గత ఏడాది డిసెంబర్ నెలలో తంజావూర్ కు చెందిన శిల్పా (పేరు మార్చడం జరిగింది)తో ఎడ్విన్ జయకుమార్ పెళ్లి జరిగింది.
ఫస్ట్ నైట్ మందు కొట్టి నిద్రపోయాడు
బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉండవచ్చని శిల్పా బావించింది. పెళ్లి జరిగిన రోజు గ్రాండ్ గా ఫస్ట్ నైట్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే బెడ్ రూమ్ లోకి వెళ్లిన ఎడ్విన్ జయకుమార్ అప్పటికే ఫుల్ గా మందు కొట్టడంతో దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు. భర్త జయకుమార్ కు ఏమైనా స్వల్ప అనారోగ్యంగా ఉందోమో ? అని శిల్పా పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజులు రాత్రిపూట ఇలాగే జరిగిపోయింది.
విరహం తట్టుకోలేక భార్య సరసాలు
పెళ్లి జరిగిన తరువాత వారం, నెల, రెండు నెలలు అయినా భర్త జయకుమార్ తనతో సరసాలు ఆడకపోవడం కొత్త పెళ్లి కూతురు శిల్పా విసిగిపోయింది. ఇక లాభంలేదని భార్య శిల్పా భర్త జయకుమార్ దగ్గరకు వెళ్లి సరసాలు ఆడటానికి ప్రయత్నించిన సమయంలో భర్త జయకుమార్ చీదరించోవడంతో శిల్పాకు మండిపోయింది. ప్రతిరోజు అర్దరాత్రి వరకు బెడ్ రూమ్ లో జయకుమార్ మొబైల్ ఫోన్ లో కాలం గడపడంతో శిల్పాకు అనుమానం వచ్చింది. ఈ నగరానికి ఏమైయ్యింది ? అనే యాడ్ లాగా నా భర్తకు ఏమైయ్యింది ? అంటూ శిల్పా రకరకాలుగా ఆలోచించడంతో ఆమెకు పిచ్చిపట్టినట్లు అయ్యింది.
వాడి నోట్లో మన్నుపోయ్యా.... ఇదేం పని ?
ఓ రోజు భర్త జయకుమార్ బ్యాంకుకు వెళ్లిన తరువాత బెడ్ రూమ్ లోని అతని లాకర్ తీసిన శిల్పా పరిశీలించింది. జయకుమార్ ఉపయెగిస్తున్న మొబైల్ ఫోన్ కాకుండా లాకర్ లో 12 స్మార్ట్ సెల్ ఫోన్లు, మూడు ల్యాప్ లు ఉండంటం గుర్తించింది. శిల్పా చదువుకోవడంతో సెల్ ఫోన్లు పరిశీలించగా ఆమె షాక్ కు గురైయ్యింది. 12 సెల్ ఫోన్లు, మూడు ల్యాప్ ట్యాప్ లు నిండుగా పొర్న్ వీడియోలు. అన్ని లోకల్ మసాలాలే అని గుర్తించిన శిల్పాకు దిమ్మతిరిగిపోయింది. సెల్ ఫోన్లలోని పోర్న్ వీడియోల్లో చాలా వరకు తన భర్త జయకుమార్ అనేక మంది అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చేస్తూ సరసాలు ఆడుతున్న వీడియోలు, ఫోటోలు చూసిన భార్య శిల్పా షాక్ కు గురైయ్యింది. వీడినోట్లో మన్నుపోయ్యా, నాతో సరసాలు ఆడకుండా వీడికేం పోయేకాలం అంటూ శిల్పా రిగిలిపోయింది.
మెరుపుతీగ అమ్మాయిల నుంచి కంతిరీగ ఆంటీలు
భర్త జయకుమార్ సరసాలు ఆడిన వారిలో 20 ఏళ్ల అమ్మాయిల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న ఆంటీల వరకు ఉన్నారని తెలుసుకున్న శిల్పా రగిలిపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన భర్త జయకుమార్ ను శిల్పా నిలదీసింది. నేను ఎవరితో అయినా సరసాలు ఆడుతాను, నీకెందుకు, నోరుమూసుకుని ఉండాలి, లేదంటే నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ భర్త జయకుమార్ రెచ్చిపోయాడు. ప్రతిరోజూ జయకుమార్, శిల్పాల మద్య ఇదే విషయంలో గొడవలు జరిగాయి. అయితే భర్త జయకుమార్ మాత్రం భార్య శిల్పా దారిలోకి రాలేదు.
3 ల్యాప్ టాప్ లు, 12 మొబైల్ ఫోన్లు
బ్యాంకు క్యాషియర్ జయకుమార్ 12 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ లో 400కు పైగా పోర్న్ వీడియోలు ఉన్నాయని, అతను అనేక మంది అమ్మాయిలు, వివాహిత మహిళల నగ్న చిత్రాలు సేకరించాడని గుర్తించింది. పరాయి స్త్రీల జీవితాలతో కామాంధుడైన తన భర్త ఆడుతున్న రాసలీలలు చూసి తట్టుకోలేని శిల్పా ఈ 2020 ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదైన తరువాత ఎడ్విన్ జయకుమార్ మాయం అయిపోయాడు. సుమారు ఐదు నెలల పాటు గాలించిన పోలీసులు చివరికి ఎడ్విన్ జయకుమార్ ను 2020 జులై 10వ తేదీ అరెస్టు చేశారు.
ఇదో వింత వ్యాధి
బ్యాంకులో క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్న ఎడ్విన్ జయకుమార్ ఆ బ్యాంకుకు వస్తున్న కస్టమర్లలో అమ్మాయి, ఆంటీలను సెలక్ట్ చేసుకుని మాయమాటలు చెప్పి వారిని అనేక రకాలుగా లొంగదీసుకున్నాడని వెలుగు చూసింది. తనకు లొంగని వివాహిత మహిళను బెదిరించిన జయకుమార్ వారితో నగ్నంగా వీడియో కాల్స్ చేశాడని. చాటింగ్ చేశాడని. చాలా మందితో అతను సరసాలు ఆడాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమ్మాయిలు, వివాహిత మహిళలతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు తీసి భార్యతో కాపురం చెయ్యకుండా ఆవీడియోలు చూస్తూ ఎంజాయ్ చేసేవాడని, ఇది అతనికి హాబీగా, వింత వ్యాధిగా మారిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
నా భార్యను చూస్తే మూడ్ రాదు
అనేక మంది పరాయి మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్న తరువాత తన భార్య శిల్పాతో కాపురం చెయ్యాలంటే బేజారుగా ఉండేదని, ఆమెను చూస్తే మూడ్ రాలేదని అందుకే ఆమెతో సంసారం చెయ్యలేదని పోలీసుల విచారణలో జయకుమార్ అంగీకరించాడు. 2020లో బ్యాంకు క్యాషియర్ జయకుమార్ వ్యవహారం అతను పని చేస్తున్న బ్యాంకులోని కొందరు ఖాతాదారులతో పాటు సాటి బ్యాంకు ఉద్యోగులు కలవరానికి గురి చెయ్యడం పెద్ద కలకలం రేపింది.