9to18 Years: ఒంటరి అమ్మాయిలు, డైరెక్టర్ కామాంధుడు, అక్కడ ఏం జరిగిందంటే ?, హెల్ప్ లైన్!
చెన్నై/ బెంగళూరు: అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. అనేక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, తల్లిదండ్రులు గాలికి వదిలేసిన అమ్మాయిలు ఆనాథాశ్రమంలో తలదాచుకుని చదువుకుంటున్నారు. ఏదో ఒకరకంగా నిధులు వసూలు చేస్తున్న ఆనాధాశ్రయం నిర్వహకుడు అమ్మాయిలను అనేక రకాలుగా లైంగిక వేధింపులకు గురి చేశాడు.
కామాంధుడి లైంగిక వేధింపులు తట్టుకోలేని అమ్మాయిలు హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి లబోదిబో అనడంతో ఆ అనాథాశ్రయం నిర్వహకుడు చాకచక్యంగా ఎస్కేప్ అయ్యాడు. అనాథాశ్రమంలో 19 మంది అమ్మాయిలు, మైనర్ బాలికలు వివిద రకాలుగా లైంగిక వేధింపులకు గురైనారని వెలుగు చూడటంతో పోలీసులు, ప్రభుత్వ శాఖ అధికారులతో పాటు అందరూ షాక్ అయ్యారు.
Massage: యాపిల్ పండ్లు లాంటి అమ్మాయిలు, మసాజ్ తో మస్త్ మజా, దెబ్బకు దూల, దెయ్యం దిగిపోయింది!
ఆర్కేవ్ లో అమ్మాయిలు
చెన్నై సిటీలోని వ్యాసర్పాది సత్యమూర్తి ఏరియాలోని ఆర్కేవ్ ప్రాంతంలో ప్రైవేట్ సామాజిక, ఆర్థిక విద్యా పునారావాస కేంద్రం అనే అనాథాశ్రయం నిర్వహిస్తున్నారు. ఈ అనాథాశ్రయాన్ని కల్యాణ సుందరం అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఈ అనాథాశ్రమానికి కల్యాణ సుందరం డైరెక్టర్.
హెల్ప్ లైన్ కు అమ్మాయి ఫోన్
కల్యాణ సుందరం నిర్వహిస్తున్న ఈ అనాథాశ్రయంలో వివిద సమస్యలతో అనేక మంది అమ్మాయిలు తలదాచుకుని వారు పెట్టింది తింటూ కాలం గడుపుతున్నారు. బుధవారం పోలీసు హెల్ప్ లైన్ కు ఓ అమ్మాయి ఫోన్ చేసింది. సార్ మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము, దయచేసి మమ్మల్ని మీరే కాపాడండి అంటూ ఆ అమ్మాయి వేడుకునింది.
ఇంత ఘోరమా ?
అమ్మాయి ఫోన్ చేసిన వెంటనే హెల్ప్ లైన్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ జేపీయూ, సీడబ్ల్యూసీ సభ్యులు, డీసీపీఓ, మహిళా పోలీసులు, చైల్డ్ లైన్ అధికారులతో పాటు సంబంధిత శాఖ అధికారులు అందరూ ఆ అనాథాశ్రమానికి పరుగు తీశారు. ఆ సమయంలో అనాథాశ్రమంలో తలదాచుకున్న అమ్మాయిలు ఒక్కొక్కరు ముందుకు వచ్చి వారి గోడు వినిపించడంతో అధికారులు షాక్ అయ్యారు.
కామాంధుడు, సుందరాంగుడు
కల్యాణ సుందరం నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో 18 మంది అమ్మాయిలు ఉన్నారు. 9 ఏళ్ల వయసు మొదలుకుని 20 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలు అక్కడ ఉన్నారు. కొంత మంది అమ్మాయిలు ఇప్పటికే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. అనాథాశ్రయం నిర్వహిస్తున్న కల్యాణ సుందరం చాలా కామంధుడు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
అమ్మాయిలు ఉద్దరగా చిక్కారని..... పాపం
అనాథాశ్రయంలో ఉంటున్న అమ్మాయిల్లో కొంతమంది 10వ తరగతి, ఇంటర్ చదువుతున్నారు. తల్లిదండ్రులు దూరం అయిన వారు, ఆర్థిక సమస్యలు తట్టుకోలేక పస్తులు ఉంటున్న తల్లిదండ్రులు వారి పిల్లలను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లారని పోలీసులు, సంబంధిత అధికారుల విచారణలో వెలుగు చూసింది.
Recommended Video
చిక్కితే తోలు తీసేస్తారు.... గ్యారెంటి
అనాథాశ్రయంలో 18 మంది అమ్మాయిలను రక్షించిన పోలీసులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. 18 మంది అమ్మాయిలను కల్యాణ సుందరం అనేక రకాలుగా లైంగిక వేధింపులకు గురి చేశాడని మహిళా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కల్యాణ సుందరం ప్రస్తుతం మాయం అయ్యాడని పోలీసులు అంటున్నారు. కల్యాణ సుందరం చిక్కితే గ్యారెంటీగా బెండ్ తీస్తారని వెలుగు చూసింది.