చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

|
Google Oneindia TeluguNews

చెన్నై/మదురై: దంపతులకు వివాహం జరిగి 8 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ దంపతులకు కుమార్తె ఉంది. భర్త కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య స్కూల్ టీచర్. లాక్ డౌన్ సందర్బంగా భార్య ఇంట్లోనే ఉంటున్నది. రాత్రి బెడ్ రూమ్ లో తన కోరిక తీర్చాలని భర్త భార్యకు టార్చర్ పెట్టాడు. ఆ సమయంలో ఇద్దరి మద్యగొడవ ఎక్కువ అయ్యింది. అంతే భార్యకు ఎక్కడో మండిపోయి భర్త మార్మంగం కొరికేసి చంపేసింది. మరుసటి రోజు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్ కు గురైనారు. కోరిక తీర్చమని లైంగిక వేధింపులకు గురి చేసిన భర్తను స్వయంగా అతని భార్య హత్య చెయ్యడం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!

 భార్య స్కూల్ టీచర్

భార్య స్కూల్ టీచర్

తమిళనాడులోని మదురై జిల్లాలోని తిరుమంగళంకు చెందిన సుందర్ అలియాస్ సుధీర్ (34), అరుల్ సెల్వీ ( 28) అనే యువతికి 8 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. సుధీర్, అరుల్ సెల్వీ దంపతులకు జయశ్రీ అనే కుమార్తె ఉంది. కిజ్చంపట్టి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో అరుల్ సెల్వీ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది.

 భర్తకు లైంగిక కోరికలు ఎక్కువ

భర్తకు లైంగిక కోరికలు ఎక్కువ

సుందర్ అలియాస్ సుధీర్ మదురై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. సుధీర్ కు లైంగిక కోరికలు చాలా ఎక్కువ అని సమాచారం. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న భార్య అరుల్ సెల్వీని తన లైంగిక కోరికలు తీర్చాలని సుధీర్ వేధింపులకు గురి చేశాడని సమాచారం.

సుధీర్ హస్తప్రయోగం !

సుధీర్ హస్తప్రయోగం !


సుధీర్ ప్రతిరోజు రాత్రి బెడ్ రూమ్ లో భార్య సెల్వీ ముందు హస్త ప్రయోగం చేసుకుంటున్నాడని తెలిసింది. ఇదే విషయంలో కొంతకాలంగా సుధీర్, సెల్వీ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. తన భర్త సుధీర్ హస్త ప్రయోగం చేసుకుంటూ తన లైంగిక కోరికలు తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడని సెల్వీ చాలాకాలంగా కుమిలిపోతుందని ఆరోపణలు ఉన్నాయి.

రాత్రి మర్మాంగం కొరికేసిన భార్య ?

రాత్రి మర్మాంగం కొరికేసిన భార్య ?


శుక్రవారం రాత్రి సుధీర్, సెల్వీ, వారి కుమార్తె జయశ్రీ భోజనం చేసి నిద్రపోయారు. అర్దరాత్రి బెడ్ రూమ్ లో సుధీర్ తన లైంగిక కోరిక తీర్చాలని భార్య సెల్వీని హింసించాడని తెలిసింది. రాత్రి పూర్తిగా లైంగిక కోరికలు తీర్చాలని సుధీర్ వేధింపులు ఎక్కువ కావడంతో సెల్వీ సహనం కోల్పోయింది. తరువాత దంపతుల మధ్య తారాస్థాయిలో గొడవ జరగడంతో సెల్వీ భర్త సుధీర్ మర్మాంగం కొరికేసిందని సమాచారం.

మంచం మీద మతిలేనిస్థితిలో సుధీర్

మంచం మీద మతిలేనిస్థితిలో సుధీర్


శనివారం ఉదయం సుధీర్ బెడ్ మీద నుంచి మూర్చపోయిన స్థితిలో కిందపడిపోయాడు. వెంటనే సుధీర్ ను అతని కుటుంబ సభ్యులు తిరుమంగళం ప్రభుత్వ ఆసుపత్రిిక తరలించారు. సుధీర్ ను పరీక్షించిన వైద్యులు అతని ప్రాణాలు పోయానని నిర్దారించారు. అయితే సుధీర్ మర్మాంగం మీద రక్తపు మరకలు, కొరికన గాట్లు (కాట్లు) ఉన్న విషయం గుర్తించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

తండ్రైన Hardik Pandya,తల్లీ బిడ్డా క్షేమం | Natasa Stankovic | Oneindia Telugu
 ఏం జరిగిందో తెలియాలి

ఏం జరిగిందో తెలియాలి

సుధీర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. సుధీర్ భార్య సెల్వీ సైతం పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టుం నివేధిక వచ్చిన తరువాత పూర్తి సమాచారం వెళ్లడిస్తామని తిరుమంగళం పోలీసులు అంటున్నారు.

English summary
Horror murder: Wife beat and killed husband due to sexual torture near Madurai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X