Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!
చెన్నై/ మదురై/ తిరునల్వేలి: భర్త ఉదయం నిద్రలేస్తే డబ్బు డబ్బు అంటూ బయటకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు. భర్త బయటకు వెళ్లిన వెంటనే భార్య శుభ్రంగా స్నానం చేసి సింగారించుకుని ప్రియులతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. భర్త మంచి తనాన్ని అలసుగా తీసుకున్న భార్య ఏకంగా నలుగురు కుర్రాలతో ఎంజాయ్ చేస్తోంది.
ఉద్యోగులకు ఫస్ట్, సెంకర్, థర్డ్ షిఫ్ట్ లు ఎలా ఉంటాయో భార్య ఆమె భర్తను కాకుండా పరాయి పురుషులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఆంటీ మిల్క్ ట్యాంకర్ లా ఉండటంతో కుర్రాల ఫాలోయింగ్ ఎక్కువ అయ్యింది. తనతో కాకుండా వేరేవాళ్లతో ఆంటీ తిరుగుతుందని రగిలిపోయిన ఓ యువకుడు స్నేహితుడిని వెంట పిలుచుకుని వెళ్లి ఆంటీని కొడవలితో అడ్డంగా నరికి చంపేశాడు.
Hitech Sketch: ఫ్యామిలీ హైటెక్ వేశ్యవాటిక, గుంటూరు మిర్చి, నెల్లూరు నాటుకొడి, రాత్రి ఇది లెక్క!
ఆంటీ భర్త అమాయకుడు
తమిళనాడులోని తిరునల్వేలి (నెలై) జిల్లా ముక్కుడాల్ సమీపంలోని చెంగుళం ప్రాంతంలో ముత్తుపాండి (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ముత్తుపాండికి ముప్పిడాడి సెల్వి (37) అనే మహిళకు 13 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ముత్తుపాండి, సెల్వీ దంపతులకు 12 ఏళ్ల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. ముత్తుపాండి చాలా అమాయకుడని తెలిసింది.
భర్త బయటకు వెళితే భార్య జల్సా
ముత్తుపాండి తుత్తుకూడిలో లోడ్ లిఫ్టర్ గా పని చేస్తున్నాడు, డబ్బు బాగా సంపాధించి భార్య సెల్వీ, తన కుమారుడిని బాగా చూసుకోవాలని ముత్తుపాండి నిత్యం ఆలోచిస్తున్నాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత శుభ్రంగా స్నానం చేసుకుని సింగారించుకుంటున్న సెల్వీ మొదట ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో జల్సా చేస్తూ వచ్చింది.
మిల్క్ ట్యాంకర్ ఆంటీకి ఫాలోయింగ్ ఎక్కువే
భర్తకు తెలీకుండా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న సెల్వీ మరో ముగ్గురిని వలలో వేసుకుంది. సెల్వీ చూడటానికి ఎర్రగా, లావుగా మిల్క్ ట్యాంకర్ లాగా ఉండటంతో ఆమె వలలో కుర్రాలు ఈజీగా పడిపోయారు. ఒకరికి తెలీకుండా ఒకరితో చాలా కాలం సెల్వీ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. తరువాత సెల్వీ వ్యవహారం ఆమె ప్రియులు అందరితో పాటు ఆమె భర్త ముత్తుపాండికి తెలిసిపోయింది.
భర్త, బంధువులు చెప్పినా డోంట్ కేర్
నీ పద్దతి మార్చుకోవాలని, చుట్టుపక్కల వాళ్లు సూటిపోటి మాటలతో తనను నానా బూతులు తిడుతున్నారని భర్త ముత్తుపాండి భార్య సెల్వీకి మర్యదగానే నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. అయితే సెల్వీ మాత్రం నీ సోది నువ్వు చెప్పుకో, నా ఆటలు నేను ఆడుకుంటాను అంటూ భర్త ముత్తుపాండి మాటలు లెక్కచెయ్యలేదు. చివరికి బంధువులు సైతం సెల్వీని చెడుతిరుగుళ్లు తిరగరాదని చెప్పినా ఆమె మాట వినలేదని తెలిసింది.
ఆంటీని అడ్డంగా నరికేశాడు
సెల్వీ వ్యవహారంలో ఆమె ప్రియులు పోట్లాడుకునే వరకు వెళ్లింది. అయితే సెల్వీ మాత్రం మీ చావుమీరు చావండి అంటూ వాళ్లను వదిలేసింది. సెల్వీ రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 20 ఏళ్ల దుర్గా అనే యువకుడితో పాటు అతని స్నేహితుడు ఆమె ఇంట్లోకి వెళ్లారు. తరువాత పదునైన కొడవలి తీసుకుని సెల్వీని ఇష్టం వచ్చినట్లు నరకడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
ఒక్కరు కాదు ఇద్దరు కాదు.... ఆంటీతో ?
రాత్రి పొద్దుపోయిన తరువాత ముత్తుపాండి ఇంటికి వెళ్లి చూడగా సెల్వీ హత్యకు గురైన విషయం గుర్తించి గట్టిగా కేకలు వేసి స్థానికులకు విషయం చెప్పాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. సెల్వీకి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న చాలా మందితో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయంలో వాళ్లువాళ్లు గొడవలు పడ్డారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భర్త, బంధువులు చెప్పినా సెల్వీ మాట వినలేదని, అందుకే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అన్నారు. సెల్వీ హత్య కేసులో దుర్గా (20) అనే యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.