Marriage: ఉదయం పెళ్లి, సాయంత్రం పెళ్లి కొడుకు మృతి, సంతోషంలో ఊహించని షాక్!
చెన్నై/ రామనాథపురం: యువతి, యువకుడి పెళ్లికి ఇరువైపుల బంధువర్గం, స్నేహితులు, రెండు ఊర్లవాళ్లు వెళ్లారు. ఉదయం అందరి సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. అందరూ విందు భోజనం చేశారు. మద్యాహ్నం పెళ్లి కుమార్తె ఇంటికి పెళ్లి కొడుకు, వాళ్ల బంధువులు వెళ్లారు. నవదంపతుల పూలహారాలు గుమ్మానికి తగిలించారు. మరోవైపు రాత్రి శోభనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పెళ్లి జరిగిన రోజే ఇంట్లో సందడి చేస్తున్న తన ప్రాణం పోతుందని పెళ్లికొడుకు ఊహించలేదు. పెళ్లికి వెళ్లిన బంధువులు తాము వెంటనే పెళ్లి కొడుకు అంత్యక్రియల్లో పాల్లొంటామని అసలు ఊహించిఉండరు. పెళ్లి జరిగిన ఐదు గంటల్లోనె పెళ్లి కొడుకు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!
ఫ్యామిలీ షిఫ్ట్
తమిళనాడులోని రామనాథపురం జిల్లా కటాడి యూనియన్ లోని ఇలాంచెంపూర్ ప్రాంతంలో నివాసం ఉండే మలైస్వామి కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తిరుచ్చి జిల్లా సమయపురం చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. మలైస్వామికి విఘ్నేశ్వరన్ (27) అనే కుమారుడు ఉన్నాడు.
గ్రాండ్ గా పెళ్లి
సయాల్ గుడి సమీపంలోని అవపిండి మార్కెట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 22 ఏళ్ల రమ్యశ్రీ (పేరు మార్చడం జరిగింది) అనే అమ్మాయితో విఘ్నేశ్వరన్ తో పెళ్లి నిశ్చయం అయ్యింది. పెళ్లికి విఘ్నేశ్వరన్, రమ్యశ్రీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ హాజరైనారు. ఉదయం గ్రాండ్ గా పెళ్లి జరిగింది.
పెళ్లి కూతురి ఇంట్లో పెళ్లిసందడి
మద్యాహ్నం కల్యాణమండపం నుంచి అవపిండి మార్కట్ ప్రాంతంలోని పెళ్లి కుమార్తె రమ్యశ్రీ ఇంటికి అందరూ వెళ్లారు. వధూవరుల పెళ్లి పూలదండలు పెళ్లి కుమార్తె ఇంటి గుమ్మానికి తగిలించారు. పెళ్లికి వచ్చిన బంధువుల్లో చాలా మంది పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్లారు. ఇంట్లో పెళ్లికి వచ్చిన బంధువులు సందడి చేస్తున్నారు.
పెళ్లి కొడుకు ఊహించి ఉండడు
రమ్యశ్రీ ఇంటిలోని ఓ గదిలో రాత్రి శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి జరిగిన కొన్ని గంటల్లో తన ప్రాణం పోతుందని పెళ్లి కొడుకు విఘ్నేశ్వరన్ అస్సలు ఊహించిఉండడు. పెళ్లికి వెళ్లిన బంధువులు తాము వెంటనే పెళ్లి కొడుకు అంత్యక్రియలు చూస్తామని కలలో కూడా ఊహించిఉండరు.
గుండెపోటుతో పెళ్లి కొడుకు మృతి
సాయంత్రం తనకు ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పిన పెళ్లి కొడుకు విఘ్నేశ్వరన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హడలిపోయిన పెళ్లి కొడుకు, పెళ్లికూతురి కుటుంబ సభ్యులు విఘ్నేశ్వరన్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పెళ్లికొడుకు ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
పగవాళ్లకు కూడా ఈ కష్టాలు వద్దు దేవుడా
పెళ్లి జరిగిన కొన్ని గంటల్లో పెళ్లి కొడుకు ప్రాణాలు పోవడంతో పెళ్లి జరిగిన ఇంటిలో ఆర్తనాదాలు మొదలైనాయి. పెళ్లికి వచ్చిన వాళ్లు అలాగే విఘ్నేశ్వరన్ అంత్యక్రియలకు హాజరైనారు. పెళ్లి కుమార్తె పెళ్లిపారాణి ఆరకముందే ఆమె పసుపుకుంకాలు దూరం కావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు విషాదంలో మునిగిపోయారు.