MLA love: పెళ్లి కుమార్తెను పిలిపించండి, హైకోర్టు ఆదేశం, ఎమ్మెల్యే పెళ్లి కేసు, ఏం జరుగుతుందో ?
చెన్నై/ మదురై/ కల్లకూరిచి: సినిమా స్టైల్లో కాలేజ్ అమ్మాయిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అయోమయంలో పడిపోయాడు. ఇప్పటికే మా కూతురిని కిడ్నాప్ చేసి బెదిరించి బలవంతంగా అధికారం అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే వివాహం చేసుకున్నాడని పెళ్లి కుమార్తె తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. కేసు వివరాలు తెలుసుకున్న హైకోర్టు పిటిషనర్ వాదనలు వినింది. పెళ్లి కుమార్తెను మా ముందు హాజరుపరచాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు ఇప్పుడు హైకోర్టు ముందు హాజరై ఆమె తన వాదనలు న్యాయస్థానం ముందు చెప్పడానికి సిద్దం అవుతోందని తెలిసింది.
Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !
పెళ్లి కూతురు ఫ్యామిలీ
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ (AIADMK) కల్లకూరిచి ఎమ్మెల్యే ప్రభు సౌందర్య అనే కాలేజ్ అమ్మాయిని ప్రేమించాడు. సోమవారం తియకతురుగంలోని ఎమ్మెల్యే ప్రభు ఇంటిలోనే ఆయన పెళ్లి సౌందర్యతో జరిగింది. ఎమ్మెల్యే ప్రభు తల్లిదండ్రులు, సమీప బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహం సింపుల్ గా జరిగింది. అయితే ఈ పెళ్లికి పెళ్లి కుమార్తె సౌందర్య కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరూ హాజరుకాలేదు.
ఇతను అసలు ఎమ్మెల్యేనా ? లేక
అన్నాడీఎంకే
పార్టీ
ఎమ్మెల్యే
ప్రభుకు
39
ఏళ్లు,
తన
కుమార్తె
సౌందర్యకు
19
ఏళ్లు,
ఇద్దరి
మద్య
20
ఏళ్ల
తేడా
ఉందని
పెళ్లి
కుమార్తె
తండ్రి
స్వామినాథన్
ఆరోపించారు.
తన
కుమార్తెను
10
ఏళ్లుగా
ప్రేమిస్తున్నానని
ఎమ్మెల్యే
ప్రభు
మీడియాకు
చెప్పాడు,
అంటే
తన
కుమార్తెకు
9
ఏళ్లు
వయసు
ఉన్నప్పటి
నుంచి
అతను
ప్రేమిస్తున్నాడా
?,
అదిసాధ్యం
అవుతుందా
?,
9
ఏళ్ల
అమ్మాయిని
ప్రేమించిన
వాడు
ప్రజాప్రతినిధి
అవుతాడా
?,
ఎమ్మెల్యేగా
ఉండటానికి
అర్హుడా
?
అంటూ
పెళ్లి
కుమార్తె
సౌందర్య
తండ్రి
స్వామినాథన్
ఎమ్మెల్యే
ప్రభుతోపాటు
తమిళనాడు
ప్రభుత్వ
పెద్దలను
ప్రశ్నించారు.
చుక్కలు చూపించిన స్వామినాథన్
అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభు తన కుమార్తెను కిడ్నాప్ చేసి మాయమాటలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ పెళ్లి కుమార్తె సౌందర్య తండ్రి గురుక్కుల్ స్వామినాథన్ శరీరం మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. ఎమ్మెల్యే పెళ్లి చేసుకున్న అమ్మాయి తండ్రి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో తమిళ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎమ్మెల్యే ప్రభు కులం, సౌందర్య కులం వేరు కావడంతో వీరు పెళ్లి చేసుకోవడానికి మొదట నుంచి అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.
హైకోర్టులో విచారణ
తన కుమార్తె సౌందర్యను ప్రభు కిడ్నాప్ చేశాడని, బెదిరించి వారి కుటుంబ సభ్యుల సమక్షంతో నా కూతురిని పెళ్లి చేసుకున్నాడని, తన కుమార్తెను తనకు అప్పగించాలని సౌందర్య తండ్రి స్వామినాథన్ చెన్నై హై కోర్టు (మద్రాసు హైకోర్టు)ను ఆశ్రయించాడు. గురువారం మద్రాసు హైకోర్టులో కేసు విచారణ జరిగింది. పెళ్లి కుమార్తె సౌందర్య తండ్రి స్వామినాథన్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.
పెళ్లి కుమార్తెను పిలిపించండి
మా
అమ్మాయి
సౌందర్యకు
19
ఏళ్లు
మాత్రమే,
ఆమెను
కిడ్నాప్
చేసి
బెదిరించి
ఎమ్మెల్యే
ప్రభు
పెళ్లి
చేసుకున్నాడని
పెళ్లి
కుమార్తె
తండ్రి
స్వామినాథన్
కోర్టుకు
చెప్పారు.
ఇదే
సమయంలో
తాము
ఇష్టప్రకారం
పెళ్లి
చేసుకున్నామని,
నేను
ఎవ్వరినీ
కిడ్నాప్
చెయ్యలేదని
ఎమ్మెల్యే
ప్రభు
రెండు
రోజుల
క్రితం
విడుదల
చేసిన
వీడియోను
ఆయన
తరుపు
న్యాయవాదులు
కోర్టులో
సమర్పించారు.
మద్రాసు
హైకోర్టు
ద్విసభ్య
ధర్మాసనం
న్యాయమూర్తులు
సుందరేష్,
కృష్ణకుమార్
లు
కేసు
వివరాలు
తెలుసుకున్నారు.
వాదనలు
విన్న
హైకోర్టు
ద్విసభ్య
ధర్మాసనం
పెళ్లి
కుమార్తె
సౌందర్యను
శుక్రవారం
కోర్టు
ముందు
హాజరుపరచాలని
సంబంధిత
పోలీసు
అధికారులకు
ఆదేశాలు
జారీ
చేసింది.
ప్రేమించాను మహాప్రభో..... నన్ను నమ్మండి
కాలేజ్
లో
ఎంఏ
ఇంగ్లీష్
ద్వితీయ
సంవత్సరం
చదువుతున్న
సౌందర్యను
తాను
కొన్ని
నెలలుగా
ప్రేమిస్తున్నానని,
నేను
అంటే
ఆమెకు
చాలా
ఇష్టమని,
అందుకే
పెళ్లి
చేసుకున్నానని
ఎమ్మెల్యే
ప్రభు
ఇటీవల
ఆయన
విడుదల
చేసిన
వీడియోలో
వివరించాడు.
నేను,
సౌందర్య
ఇష్టపడి
మా
కుటుంబ
పెద్దల
అంగీకారంతో
పెళ్లి
చేసుకున్నామని
ఎమ్మెల్యే
ప్రభు
అంటున్నారు.
నేను ఎందుకు చంపుతాను..... చెప్పండి !
తాను సౌందర్యను కిడ్నాప్ చెయ్యలేదని, ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తానని తాను ఎప్పుడు బెదిరించలేదని, ఎవరైనా అత్తమామలను చంపుకుంటారా ? మీరే చెప్పండి అంటూ అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే ప్రభు అంటున్నాడు. సౌందర్య తనను ఎంతో ఇష్టపడిందని, అందుకే కులాలు వేరైనా వాటి గురించి ఆలోచించకుండా మా కుటుంబ సభ్యులను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నానని, ఫోటోలు, వీడియోలో సౌందర్య కూడా చాలా సంతోషంగా ఉందని, ఆ విషయం అందరూ చూశారని ఎమ్మెల్యే ప్రభు వివరణ ఇచ్చారు. అయితే హైకోర్టు ముందు పెళ్లి కుమార్తె సౌందర్య ఏం సమాధానం ఇస్తుందో ? అనే విషయంపై ఇప్పుడు అందరికి టెన్షన్ మొదలైయ్యింది.