MLA love marriage: ఎమ్మెల్యే 39, కాలేజ్ అమ్మాయి 19, ఆత్మహత్యాయత్నం, 10 ఏళ్లు లవ్!
చెన్నై/ మదురై/ కల్లకురిచి: ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వివాహాలు చేసుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాలేజ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యేకి 39 ఏళ్లు, పెళ్లి కుమార్తెకు 19 ఏళ్ల వయసు ఉందని ఆరోపణలు మొదలైనాయి. ఎమ్మెల్యే తన కుమార్తెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరికి 20 ఏళ్లు తేడా ఉందని ఆరోపిస్తూ పెళ్లి కుమార్తె తండ్రి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పెళ్లి విషయంలో రచ్చరచ్చ కావడంతో ప్రభుత్వ పెద్దలు షాక్ కు గురైనారు. పెళ్లికి ఒప్పుకోకపోతే మమ్మల్ని చంపేస్తామని ఎమ్మెల్యే బెదిరించాడని పెళ్లి కూతురి తండ్రి ఆరోపించాడు.
Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!
డిఫరెంట్ ఎమ్మెల్యే
తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ (AIADMK) అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని కల్లకూరిచి శాసన సభ నియోజక వర్గం నుంచి ప్రభు పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అన్నాడీఎంకే చీఫ్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆశీస్సులతో ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రభు విజయం సాధించారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ నియోజక వర్గంలోని ప్రతిసమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సొంత పార్టీ మీద చిందులు వేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఎమ్మెల్యే ప్రభు వరైటీ వరైటీ కార్యక్రమాలు చేస్తూ అందరిలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్
అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు సౌందర్య అనే కాలేజ్ అమ్మాయి ప్రేమలో పడ్డారు. ప్రేమించిన సౌందర్యను సోమవారం ప్రభు వివాహం చేసుకున్నారు. తియకతురుగంలోని ఎమ్మెల్యే ప్రభు ఇంటిలోనే పెళ్లి జరిగింది. ఎమ్మెల్యే ప్రభు తల్లిదండ్రులు, సమీప బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన వివాహం చాలా సింపుల్ గా జరిగింది. అయితే ఈ పెళ్లికి పెళ్లి కుమార్తె సౌందర్య కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరూ హాజరుకాలేదు.
లీడర్స్ అందుకేనా ఢుమ్మా !
అధికార పార్టీ ఎమ్మెల్యేలు వివాహాలు చేసుకోవడం చాలా అరుదు. అందులో ఈ ఎమ్మెల్యే ప్రభు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రభు, సౌందర్యల వివాహానికి అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఎవ్వరూ హాజరుకాలేదు. అందుకు ఓ కారణం ఉంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురై బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళ నటరాజన్ మేనల్లుడు, చెన్నై ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ. దినకరన్ అనుచరుడిగా ఈ ఎమ్మెల్యే ప్రభు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ కారణాలతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవ్వరూ ప్రభు, సౌందర్యల పెళ్లికి హాజరుకాలేదని తమిళ మీడియా అంటోంది.
ఎమ్మెల్యే కులాంతర వివాహం
అన్నాడీఎంకే ప్రభు కులం, పెళ్లి కుమార్తె సౌందర్య కులం వేరుకావడంతో ఈ పెళ్లికి ప్రాధాన్యత ఏర్పడింది. తమిళనాడులో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు హత్యలకు గురి కావడం, కొందరు ప్రేమికులు మా కులాలు వేరు అంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు .ఇలాంటి సమయంలో ప్రేమికులకు ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే ప్రభు కాలేజ్ అమ్మాయి సౌందర్యను ప్రేమించి కులాంతర వివాహం చేసుకుని ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాడు.
పెళ్లి కుమార్తె తండ్రి ఆత్మహత్యయాత్నం
ఎమ్మెల్యే ప్రభు తన కుమార్తెకు మాయమాటలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ పెళ్లి కుమార్తె సౌందర్య తండ్రి గురుక్కుల్ స్వామినాథన్ శరీరం మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. ఎమ్మెల్యే పెళ్లి చేసుకున్న అమ్మాయి తండ్రి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. ఎమ్మెల్యే ప్రభును సౌందర్య పెళ్లి చేసుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.
ఎమ్మెల్యే @ 39, అమ్మాయి @ 19
పెళ్లి కుమార్తె సౌందర్య తండ్రి స్వామినాథన్ ఒన్ ఇండియా తమిళ్ తో మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రభుకు 39 ఏళ్లు, తన కుమార్తె సౌందర్యకు 19 ఏళ్లు, ఇద్దరి మద్య 20 ఏళ్ల తేడా ఉందని స్వామినాథన్ ఆరోపించారు. తన కుమార్తెను 10 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని ఎమ్మెల్యే ప్రభు మీడియాకు చెబుతున్నాడు, అంటే తన కుమార్తెకు 9 ఏళ్లు వయసు ఉన్నప్పటి నుంచి అతను ప్రేమిస్తున్నాడా ?, అదిసాధ్యం అవుతుందా ? అంటూ పెళ్లి కుమార్తె సౌందర్య తండ్రి స్వామినాథన్ ఎమ్మెల్యే ప్రభుతోపాటు తమిళనాడు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు.
Recommended Video
చంపేస్తామని ఎమ్మెల్యే బెదిరించాడు ?
మీకు ఇష్టం ఉన్నా, లేకపోయినా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మీరు ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి సిద్దం అయితే మిమ్మల్ని చంపేస్తానని ఎమ్మెల్యే ప్రభు తనతోపాటు తన కుటుంబ సభ్యులను బెదిరించాడని పెళ్లి కుమార్తె సౌందర్య తండ్రి స్వామినాథన్ ఆరోపిస్తున్నారు. పెళ్లి కుమారుడు ప్రభు, పెళ్లి కుమార్తె సౌందర్య మద్య 20 ఏళ్ల తేడా ఉందని, మా అమ్మాయి జీవితం నాశనం అవుతుందని స్వామినాథన్ విలపిస్తున్నాడు. పెళ్లి కుమారుడికి, పెళ్లి కుమార్తెకు మధ్య 20 ఏళ్ల వయసు తేడా ఉందని స్వయంగా అమ్మాయి తండ్రి ఆరోపించడం కలకలం రేపింది. ఎమ్మెల్యే ప్రభు నుంచి మా అమ్మాయి సౌందర్యను కాపాడి మాకు అప్పగించాలని స్వామినాథన్ పోలీసులను, తమిళనాడు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. మొత్తం మీద అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభు వివాహం తమిళనాడు రాజకీయాల్లో రచ్చరచ్చ అయ్యింది.