MLA love marriage: నేను ఎవర్ని ? ఎమ్మెల్యే, ఇది నా లవ్ స్టోరీ, లాక్ డౌన్ లో ఏం పీకేపని, హైకోర్టులో!
చెన్నై/ మదురై/ కల్లకూరిచి: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్ వ్యవహారం రచ్చరచ్చ అవుతోంది. తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించి ఎమ్మెల్యే ప్రభు పెళ్లి చేసుకున్నాడని పెళ్లి కుమార్తె తండ్రి హై కోర్టును ఆశ్రయించాడు. ఎమ్మెల్యే ప్రభు చెరలో ఉన్న తన కుమార్తెను రక్షించి మాకు అప్పగించి మాకు పోలీసు రక్షణ కల్పించాలని పెళ్లి కుమార్తె తండ్రి కోర్టుకు మనవి చేశారు. ఇద్దరి మద్య 20 ఏళ్ల తేడా ఉందని పెళ్లి కుమార్తె తండ్రి ఆరోపించడంతో మా దగ్గర దానికి సంబంధించి ఎలాంటి సాక్షాలు లేవని పోలీసులు చేతులు ఎత్తేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి పోలీసులు వంతపాడుతూ మాకు అన్యాయం చేస్తున్నారని పెళ్లి కుమార్తె తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే నేను ఎవరు ? సిట్టింగ్ ఎమ్మెల్యే, నేను ఎవ్వరినీ బెదిరించలేదు, కిడ్నాప్ చెయ్యలేదు, నా ప్రేమకథ వినండి అంటూ ఎమ్మెల్యే ఓ వీడియో విడుదల చెయ్యడం కలకలం రేపుతోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ టైమ్ లో మా ఇంట్లో ఎమ్మెల్యేకి ఏం పీకేపని అంటూ అమ్మాయి తండ్రి ప్రశ్నిస్తున్నాడు.
Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !
ఎమ్మెల్యే పెళ్లి
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే (AIADMK)ఎమ్మెల్యే ప్రభు సౌందర్య అనే కాలేజ్ అమ్మాయి ప్రేమలో పడ్డారు. ప్రేమించిన సౌందర్యను సోమవారం కల్లకూరిచి నియోజక వర్గం ఎమ్మెల్యే ప్రభు కులాంతర వివాహం చేసుకున్నారు. తియకతురుగంలోని ఎమ్మెల్యే ప్రభు ఇంటిలోనే పెళ్లి జరిగింది. ఎమ్మెల్యే ప్రభు తల్లిదండ్రులు, సమీప బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన వివాహం చాలా సింపుల్ గా జరిగింది. అయితే ఈ పెళ్లికి పెళ్లి కుమార్తె సౌందర్య కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరూ హాజరుకాలేదు.
పెళ్లి కూతురి తండ్రి దెబ్బతో షాక్
అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభు తన కుమార్తెను కిడ్నాప్ చేసి మాయమాటలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ పెళ్లి కుమార్తె సౌందర్య తండ్రి గురుక్కుల్ స్వామినాథన్ శరీరం మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. ఎమ్మెల్యే పెళ్లి చేసుకున్న అమ్మాయి తండ్రి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో తమిళనాడు ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఎమ్మెల్యే ప్రభును సౌందర్య పెళ్లి చేసుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రస్థాయిలో మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు.
ఇదేమి న్యాయం స్వామి
పెళ్లి
కుమార్తె
సౌందర్య
తండ్రి
స్వామినాథన్
మీడియాతో
మాట్లాడారు.
ఎమ్మెల్యే
ప్రభుకు
39
ఏళ్లు,
తన
కుమార్తె
సౌందర్యకు
19
ఏళ్లు,
ఇద్దరి
మద్య
20
ఏళ్ల
తేడా
ఉందని
స్వామినాథన్
ఆరోపించారు.
తన
కుమార్తెను
10
ఏళ్లుగా
ప్రేమిస్తున్నానని
ఎమ్మెల్యే
ప్రభు
మీడియాకు
చెప్పాడు,
అంటే
తన
కుమార్తెకు
9
ఏళ్లు
వయసు
ఉన్నప్పటి
నుంచి
అతను
ప్రేమిస్తున్నాడా
?,
అదిసాధ్యం
అవుతుందా
?
అంటూ
పెళ్లి
కుమార్తె
సౌందర్య
తండ్రి
స్వామినాథన్
ఎమ్మెల్యే
ప్రభుతోపాటు
తమిళనాడు
ప్రభుత్వ
పెద్దలను
ప్రశ్నించారు.
తనకు
న్యాయం
చెయ్యాలని
పోలీసులను
ఆశ్రయించినా
వాళ్లు
ఎమ్మెల్యేకి
వంతపాడుతున్నారని
సౌందర్య
తండ్రి
స్వామినాథన్
ఆరోపించారు.
హైకోర్టులో ఎమ్మెల్యేపై కేసు
తన కుమార్తె సౌందర్యను ప్రభు కిడ్నాప్ చేశాడని, బెదిరించి వారి కుటుంబ సభ్యుల సమక్షంతో నా కూతురిని పెళ్లి చేసుకున్నాడని, తన కుమార్తెను తనకు అప్పగించాలని సౌందర్య తండ్రి స్వామినాథన్ చెన్నై హై కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో బుధవారం కేసు విచారణ జరగనుంది. తనకు హైకోర్టులో న్యాయం జరుగుతుందని సౌందర్య తండ్రి స్వామినాథన్ మంగళవారం మీడియాకు చెప్పారు.
నేను ఎవర్ని ?.... సిట్టింగ్ ఎమ్మెల్యే... బికారి కాదు
కులాంతర వివాహం చేసుకున్న ఎమ్మెల్యే ప్రభు గురించి రోజుకో కథనం మీడియాలో వస్తోంది. నిన్న (సోమవారం) పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే ప్రభు తన మీద వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. నేను ఎవర్ని, సిట్టింగ్ ఎమ్మెల్యే, బికారి కాదు, నాకు నా నియోజక వర్గం ప్రజలు ముఖ్యం, తన మీద కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నా లవ్ స్టోరీ ఇలా ఉందని ఎమ్మెల్యే ప్రభు వివరించారు.
కులం ముఖ్యం కాదు... నా లవ్ స్టోరీ ఇదే
కాలేజ్
లో
ఎంఏ
ఇంగ్లీష్
ద్వితీయ
సంవత్సరం
చదువుతున్న
సౌందర్యను
తాను
4
నెలలుగా
ప్రేమిస్తున్నానని,
నేను
అంటే
ఆమెకు
చాలా
ఇష్టమని,
అందుకే
పెళ్లి
చేసుకున్నానని
ప్రభు
వివరించాడు.
నేను,
సౌందర్య
ఇష్టపడి
కుటుంబ
పెద్దల
అంగీకారంతో
పెళ్లి
చేసుకున్నామని
ఎమ్మెల్యే
ప్రభు
అంటున్నారు.
తాను
సౌందర్యను
కిడ్నాప్
చెయ్యలేదని,
ఆమె
కుటుంబ
సభ్యులను
చంపేస్తానని
తాను
ఎప్పుడు
బెదిరించలేదని
అన్నాడీఎంకే
పార్టీ
ఎమ్మెల్యే
ప్రభు
వివరణ
ఇచ్చాడు.
సౌందర్య
తనను
ఎంతో
ఇష్టపడిందని,
అందుకే
కులం
గురించి
ఆలోచించకుండా
మా
కుటుంబ
సభ్యులను
ఒప్పించి
వారి
సమక్షంలోనే
పెళ్లి
చేసుకున్నానని,
ఫోటోలలో
సౌందర్య
కూడా
చాలా
సంతోషంగా
ఉందని,
ఆ
విషయం
అందరూ
చూశారని
ఎమ్మెల్యే
ప్రభు
వివరణ
ఇచ్చారు.
కరోనా, లాక్ డౌన్ టైమ్ లో మా ఇంట్లో ఏం పీకేపని ?
ఎమ్మెల్యే ప్రభు తన లవ్ స్టోరీ ఇది అంటూ వీడియో విడుదల చేసిన తరువాత సౌందర్య తండ్రి స్వామినాథన్ మండిపడ్డాడు. ఎమ్మెల్యే ప్రభు తనకు 13 సంవత్సరాలుగా తెలుసని, మా ఇంటికి వచ్చివెళ్లేవాడని సౌందర్య తండ్రి స్వామినాథన్ అన్నారు. నాలుగు నెలల నుంచి తన కూతురు సౌందర్యను ప్రేమిస్తున్నానని ఎమ్మెల్యే ప్రభు చెప్పాడు, అప్పుడు కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ అమలులో ఉంది, ఆ టైమ్ లో అతను మా ఇంటికి ఎందుకు వచ్చాడు ?, అతనికి మా ఇంట్లో ఏం పని ?, ఇవన్ని డ్రామాలు, సౌందర్యను, మమ్మల్ని బెదిరించి ఎమ్మెల్యే ప్రభు బలవంతంగా మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పెళ్లి కుమార్తె తండ్రి స్వామినాథన్ మండిపడుతున్నాడు.
Recommended Video
సౌందర్య కాలేజ్ ఎప్పుడు మూసేశారో తెలుసా !
కరోనా వైరస్ కారణంగా గత 6, 7 నెలల నుంచి సౌందర్యతో పాటు మా కుటుంబ సభ్యులు అందరూ ఇంటికే పరిమితం అయ్యామని పెళ్లి కుమార్తె తండ్రి స్వామినాథన్ మీడియాకు చెప్పారు. గత ఫిబ్రవరి నెల చివరి వారం నుంచి సౌందర్య కాలేజ్ కు వెళ్లలేదని, లాక్ డౌన్ సమయంలో ఆమె పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యిందని స్వామినాథన్ అన్నాడు. తన కుమార్తె సౌందర్యను కొన్ని నెలలుగా తాను ప్రేమిస్తున్నాను అంటూ ప్రభు చెప్పడం విడ్డూరంగా ఉందని, కరోనా వైరస్, లాక్ డౌన్ టైమ్ లో పనిపాట లేకుండా మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని ఎమ్మెల్యే ప్రభు ప్రేమించాడా ?, ఆ విషయం బహిరంగంగా ప్రజలకు చెప్పగలడా ? అంటూ స్వామినాథన్ నిలదీశాడు. ప్రభు విడుదల చేసిన వీడియో కూడా తాను కోర్టుకు సమర్పిస్తానని, అతను కోర్టులోనే ప్రజలకు సమాధానం చెప్పాలని సౌందర్య తండ్రి స్వామినాథన్ అంటున్నారు.