BAN: మోదీ పవర్ ఫుల్ పంచ్, దెబ్బకు దెయ్యం దిగింది, కేంద్రానికి వ్యతిరేక ప్రభుత్వం, అక్కడ పీఎఫ్ఐ ఫినిష్!
చెన్నై/తిరువనంతపురం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) సంస్థను ఐదు సంవత్సరాలు పాటు నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే .ఇదే సందర్బంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు పాటిస్తూ అనేక రాష్ట్రాల్లో పీఎఫ్ఐని నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి పూర్తిగా వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలో, పీఎఫ్ఐ బలంగా ఉన్న ఆ రాష్ట్రంలో పీఎఫ్ఐని నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పీఎఫ్ఐ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల మీద ఆయా సంస్థలు వేటు వేశాయి.
Wife: ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు, ఫైటింగ్, విరక్తితో నవ వదువు ?, భర్తకు, ఫస్ట్ భార్యకు క్లైమాక్స్!
ఉగ్రవాద సంస్థలతో లింక్
పీఎఫ్ఐ సంస్థ ఉగ్రవాద సంస్థలతో లింక్ పెట్టుకుని సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తోందని ఆరోపణలు వచ్చాయి. పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ, సీపీఎఫ్ సంస్థలకు ఉగ్రవాదులు ఆర్థిక సహాయం చేస్తున్నాయని, ఆయుధాలు ఎలా ఉపయోగించాలి, బాంబు పేలుళ్లు ఎలా ప్రయోగించాలి అని శిక్షణ ఇస్తున్నాయని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది.
పీఎఫ్ఐ భరతం పట్టిన ఎన్ఐఏ
కొంతకాలంగా దేశంలోని పీఎఫ్ఐ తదితర సంస్థల మీద ఎన్ఐఏ అధికారులు డేగ కన్ను వేశారు. పీఎఫ్ఐ ముసుగులో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా, ఆ సంస్థ నిర్వహకుల గురించి పూర్తి సమాచారం సేకరించి ఇప్పటికే వారి భరతం పట్టారు.
కేరళలో బలంగా ఉన్న పీఎఫ్ఐ
సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా దాడులు చేస్తున్న సమయంలోనే కేరళలో ఆ సంస్థ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎన్ఐఏ దెబ్బకు తట్టుకోలేని కేరళలోని ఆసంఘం ప్రతినిధులు ఇప్పటికే బంద్ నిర్వహించడం జరిగింది. కేరళలో పీఎఫ్ఐ నిర్వహించిన బంద్ హింసకు దారితీసి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ద్వంసం కావడమే కాకుండా అనేక మంది అమాయకులకు గాయాలైనాయి.
కేరళలో పీఎఫ్ఐని బ్యాన్ చేసిన ప్రభుత్వం
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) సంస్థను ఐదు సంవత్సరాలు పాటు నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే .ఇదే సందర్బంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు పాటిస్తూ అనేక రాష్ట్రాల్లో పీఎఫ్ఐని నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి.
చీటి చినిగిపోయింది
కేరళలో కూడా పీఎఫ్ఐని, దాని అనుబంధ సంస్థలను నిషేధిస్తూ ఆ రాష్ట్రంలోని పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేరళలో పీఎఫ్ఐని బ్యాన్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ ఆర్డర్ కాపీని ప్రముఖ మీడియా ఏఎన్ఐ స్పష్టం చేసింది. కేరళతో పాటు తమిళనాడు ప్రభుత్వం కూడా పీఎఫ్ఐ సంస్థ కార్యకలపాలు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.