Criminal wife: భర్తకు బెడ్ రూమ్ స్కెచ్, హత్యకు రూ. లక్షలు డీల్, కెమెరామెన్ గణేష్ తో గాయిత్రి, ష్!
చెన్నై/ కన్యాకుమారి/ నాగర్ కోవిల్: ప్రియుడి మీద వ్యామోహంతో ఓ మహిళ పాటుపడింది. గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న విషయం భర్తకు తెలిసిపోయింది. ఎలాగైనా తన భర్తను చంపేస్తే ప్రియుడితో హ్యాపీగా జల్సా చెయ్యవచ్చని భార్య పక్కాప్లాన్ వేసింది. అనుకున్న ప్రకారం బెడ్ రూమ్ లో ఎవ్వరూ లేని సమయంలో భర్తను హత్య చెయ్యడానికి లక్షల రూపాయలకు డీల్ మాట్లాడుకునింది. అనుకునట్లే భర్తతో రాత్రి ఎంజాయ్ చేస్తున్నట్లు నటించిన భార్య ప్రియుడి సహకారంతో భర్త మర్మాంగం, తల మీద తీవ్రంగా దాడి చెయ్యడంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు. అయితే చేసిన పాపం ఊరికేపోదనే సామెతలాగా భార్య, అతని ప్రియుడు, ఫ్రెండ్స్ అడ్డంగా బుక్కైపోవడంతో కథ కొత్త మలుపు తిరిగింది.
Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!
కెమెరామెన్ గణేష్ తో గాయిత్రి
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ ప్రాంతానికి చెందిన గణేష్ కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. గణేష్ భార్య గాయిత్రి (31). గాయిత్రీ వివాహం అయిన తరువాత భర్త గణేష్ తో చాలా సంతోషంగా ఉండేది. అయితే గాయిత్రికి కొవ్వు ఎక్కువగా ఉంది. భర్త గణేష్ గాయిత్రికి ఉన్న కొవ్వు తగ్గించడానికి అతని సామర్థ్యం సరిపోలేదని సమాచారం.
బెడ్ రూమ్ లో ఏం జరిగిందో ?
నాలుగు రోజుల క్రితం రాత్రి భర్త గణేష్, గాయిత్రి దంపతులు భోజనం చేసిన తరువాత బెడ్ రూమ్ లోకి వెళ్లారు. అర్దరాత్రి సమయంలో గాయిత్రి గట్టిగా కేకలు వెయ్యడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు బెడ్ రూమ్ లోకి వెళ్లి చూశారు. ఆ సమయంలో మంచం మీద నుంచి గణేష్ కిందపడిపోయి తలకు తీవ్రగాయాలైన విషయం గుర్తించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.
మర్మాంగంపై గాయాలు....కోమాలో గణేష్
ఆసుపత్రిలో గణేష్ తలకు మూడు గంటలు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆతనికి మెరుగైన చికిత్స అందించారు. అయితే గణేష్ కోమాలోకి వెళ్లిపోయి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. గణేష్ స్పృహలో లేకపోవడంతో బెడ్ రూమ్ లో ఏం జరిగింది ? అనే విషయం మొదట బయటకురాలేదు. అదే సమయంలో గణేష్ మర్మాంగంపై గాయాలైనాయని, మంచం మీద నుంచి కిందపడితే తలకు ఇంత పెద్ద గాయం కాదని, తల మీద ఎవరో బలంగా దాడి చెయ్యడంతో పుర్రె చాల దెబ్బతినిందని, పట్టుటెముకలు దెబ్బ తిన్నాయని వైద్యులు తేల్చి చెప్పారు.
పోలీసుల ఎంట్రీతో ట్విస్ట్
గణేష్ కుటుంబ సభ్యులకు అనుమానం ఎక్కువ కావడతో నాగర్ కోవిల్ నార్త్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గణేష్ భార్య గాయిత్రి మీద తమకు అనుమానం ఉందని, రాత్రి బెడ్ రూమ్ లో ఆమె మాత్రమే ఉందని, ఏం జరిగిందో బయటకు రావాలంటే ఆమెను విచారణ చెయ్యాలని గణేష్ కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. పోలీసులు గాయిత్రీని అదుపులోకి తీసుకోవడంతో కథ కొత్త మలుపు తిరిగింది.
ప్రియుడు యాసీన్ వ్యామోహం
పోలీసుల విచారణలో భార్య గాయిత్రీకి యాసీన్ అనే ప్రియుడు ఉన్నాడని వెలుగు చూసింది. భర్త గణేష్ బయటకు వెళ్లిన తరువాత గాయిత్రి టిప్ టాప్ గా రెడీ కావడం, బయటకు వెళ్లి ప్రియుడు యాసీన్ తో ఎంజాయ్ చేసిందని, ఈ విషయం భర్త గణేష్ కు తెలిసి అతని భార్యకు వార్నింగ్ ఇచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయినా భార్య గాయిత్రి పద్దతి మార్చుకోకపోవడంతో రెండు సార్లు అమెకు భర్త గణేష్ బెండ్ తీశాడని, అయినా గాయిత్రీ, యాసీన్ పద్దతి మాత్రం మారలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
అన్నంలో నిద్రమాత్రలు
తన భర్త గణేష్ ను చంపేస్తే మనం హాయిగా ఎంజాయ్ చెయ్యడానికి అవకాశం ఉంటుందని గాయిత్రి ప్రియుడు యాసీన్ కు చెప్పింది. భర్త గణేష్ ను హత్య చేస్తే తాను రూ. 2 లక్షలు ఇస్తానని గాయిత్రీ ప్రియుడు యాసీన్ కు చెప్పింది. నాలుగు రోజుల క్రితం రాత్రి గణేష్ తింటున్న ఆహారంలో ప్లాన్ ప్రకారం నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో రాత్రి బెడ్ రూమ్ లో అతను మొద్దు నిద్రలోకి జారుకున్నాడు.
Recommended Video
నా భర్త ఈ లోకంలో లేడు... వెంటనే వచ్చేయ్
రాత్రి భర్త గణేష్ నిద్రపోయిన తరువాత భార్య గాయిత్రి ప్రియుడు యాసీన్ కు ఫోన్ చేసి నా భర్త ఈ లోకంలో లేడని చెప్పి అతన్ని ఇంటికి పిలిపించుకునింది. యాసీన్ వెంట అతని స్నేహితులు కరుణాకరన్, విజయ్ కుమార్ గణేష్ ఇంటికి వెళ్లారు. మెలుకవలేకుండా నిద్రపోతున్న గణేష్ తల, అతని మర్మాంగం మీద ఇనుపరాడ్లతో బలంగా దాడి చేసి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. చనిపోయిన తరువాత ఆసుపత్రికి తీసుకెళితే అనుమానం వస్తుందని ముందుగానే గాయిత్రీ కేకలు వేసి మంచం మీద నుంచి తన భర్త గణేష్ పడిపోయాడని నాటకం ఆడిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గణేష్ ను హత్య చెయ్యడానికి ప్లాన్ వేసిన గాయిత్రీ, హత్య చెయ్యడానికి ప్రయత్నించిన కరుణాకరన్, విజయ్ కుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే గాయిత్రీ ప్రియుడు యాసీన్ తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.