బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా: డిప్యూటీ సీఎం సతీమణి స్టెప్పులు.. వావ్..
బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా.. పాట ఊపు ఊపేస్తోంది. సాయి శ్రీయ తన పెళ్లి బరాత్లో చేసిన డ్యాన్స్తో హైప్ వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత మరో పెళ్లి కూతురు, చిన్నారులు డ్యాన్స్ చేసేస్తున్నారు. ఇక ప్రముఖులు కూడా కాలు కదుపుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సతీమణి కూడా డ్యాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.
యానివర్సరీ సందర్భంగా..
నారాయణ స్వామి వివాహ వార్షికోత్సవం తిరుపతిలో జరిగింది. 42వ పెళ్లిరోజు సందర్భంగా ఆయన నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో 'బుల్లెట్ బండి' పాటకు నారాయణస్వామి అర్ధాంగి స్టెప్పులేయడం విశేషం అని చెప్పాలి. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సోఫాలో కూర్చుని ఉండగా, ఆమె 'బుల్లెట్ బండి' పాటకు చక్కని అభినయంతో డ్యాన్స్ చేశారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆమెతో కాలు కదపడంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో 'బుల్లెట్ బండి' పాట బాగా ప్రజాదరణ పొందింది. ఏ శుభకార్యంలో చూసినా ఈ పాట ఉండాల్సిందే అన్నట్టుగా జనాలను ఆకట్టుకుంది.బుల్లెట్ పాట.. ఎక్కడ చూసినా మారుమోగుతోంది. ఫంక్షన్.. ఆటో, కార్లలో కూడా ఆ పాట మోత మోగుతోంది. పాట వచ్చి చాలా రోజులైనా.. సాయి శ్రీయ డ్యాన్స్తో ప్రపంచానికి తెలిసింది.
బండెక్కి వచ్చేత్త పా..
పెళ్లి
అంటే
సంతోషం.
తెలంగాణ
రాష్ట్రంలో
వధువు
చేసిన
డ్యాన్స్
నెట్టింట
వైరల్
అయ్యింది.
సాయి
శ్రీయ
వివాహం
అశోక్తో
ఈ
నెల
14వ
తేదీన
జరిగింది.
వరుడికి
వధువు
స్వాగతం
పలుకుతూ
ఓ
పాటకు
చిందులేసింది.
ఆ
వీడియో
ఇప్పుడు
సోషల్
మీడియాలో
వైరల్గా
మారింది.
పాట
తెలంగాణ
మాండలీకంలో
అద్భుతంగా
ఉంది.
ఆ
పాటకు
వధువు
చక్కగా
డ్యాన్స్
చేసింది.
పెళ్లి
కొడుకు
వచ్చిన
వాహనం
ఎదుట
పెళ్లి
కూతురు
స్వయంగా
పాట
పాడి
డ్యాన్స్
చేసింది.
వధువు
డ్యాన్స్ను
కాసేపు
నవ్వుతూ
చూసిన
వరుడు
ఆ
తర్వాత
తను
కూడా
కాలు
కదిపాడు.
వధువుతో
కలిసి
డాన్స్
చేసి
ఆ
తర్వాత
ఆగిపోయాడు.
ఆ
వధువు
మాత్రం
దాదాపు
మూడున్నర
నిమిషాల
పాటు
ఆ
పాటకు
డాన్స్
చేస్తూనే
ఉంది.
వదువు
డాన్స్ను
వరుడు
తాపీగా
నిలబడి
ఎంజాయ్
చేయసాగాడు.
చివరలో
బంధువులు,
స్నేహితులు
కూడా
వధువుతో
కలిసి
డాన్స్
చేశారు.
ఈ
వీడియో
సోషల్
మీడియాలో
చక్కర్లు
కొడుతోంది.
ముద్దుగా పెరిగా..
నా కాబోయే శ్రీవారూ, నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పద అంటూ సరదాగా మొదలయ్యే ఆ పాటలో ఎక్కువగా వధువు గురించే ఉంది. అల్లారుముద్దుగా పెరిగినట్టు, తనను ఎక్కువగా గారాబం చేసి పెంచినట్టుగా వరుడితో వధువు చెప్పుకుంటోంది. పువ్వులా పెరిగాను అయినా నీ చేయి పట్టుకోవడానికి వస్తున్నా అంటూ ఆ పాట సాగుతుంది. మీ అమ్మానాన్నల్ని మా అమ్మానాన్నల్లాగే చూసుకుంటా అంటూ బంధాల గురించి ఆ పాటలో చరణాలు ఉన్నాయి. అందుకే నెట్టింట యూత్కు తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాయి శ్రీయ డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ చక్కర్లు కొడుతోంది. ఆ తర్వాత పేరు, వివరాలు తెలియడంతో ప్రతీ ఒక్కరూ దానినే షేర్ చేస్తున్నారు. అందరూ ఆశీర్వాదం కూడా అందజేస్తున్నారు. నిండు నూరేళ్లు చల్లగా బతుకు అంటూ బ్లెస్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట కరోనా సమయంలో లక్షలాది మంది నుంచి మనస్పూర్తిగా బ్లెస్సింగ్ తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి సాయి శ్రీయ చిందులేశారు. అదే విధంగా రియాక్ట్ అయ్యారు.
రెండోసారి సేమ్ టు సేమ్
ఒకసారి చేసిన పాటకే జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మరోసారి సాయి శ్రీయ డ్యాన్స్ చేశారు. సెకండ్ పాటకు అదే రేంజ్లో రియాక్ట్ అయ్యారు. దానిని అందరూ లైక్ చేసి.. షేర్ చేసి మరింత ఊపును తీసుకొస్తున్నారు. సాయి శ్రీయ బీటెక్ చేసిన సంగతి తెలిసిందే. విప్రో కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త అశోక్.. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్.. వీరి పెళ్లి బారత్ డ్యాన్స్ కాస్త వైరల్ కావడంతో.. సెలబ్రిటీ కపుల్గా మారిపోయారు. వీరిద్దరూ ఇటీవల వేములవాడ రాజన్నను కూడా దర్శించుకున్నారు. ఈ జంట ఎక్కడికి వెళ్లినా.. జనం ఎగబడుతున్నారు. ఫోటో, సెల్పీ కోసం ట్రై చేస్తున్నారు. వీరిద్దరూ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు.